MoviesPawan Kalyan అంత మంది మెగా హీరోలు ఉంటే.. పవన్...

Pawan Kalyan అంత మంది మెగా హీరోలు ఉంటే.. పవన్ కేవలం సాయి ధరమ్ తేజ్ నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ మెగాస్టార్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ . కాగా ప్రజెంట్ రాజకీయాలలోనూ సినిమాలలోనూ నెంబర్ వన్ స్థానంతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ..సినిమాలలో కూడా జెడ్ స్పీడ్ లో ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా “వినోదయ సీతం” అనే తమిళ రీమేక్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు .

కాగా ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. అయితే మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు . రామ్ చరణ్ ,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,అల్లు అర్జున్ ,అల్లు శిరీష్ కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు సాయిధరమ్ తేజ్ నే ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సినిమా విషయంలోనే కాదు.. మొన్నటికి మొన్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి కూడా సాయి ధరమ్ వచ్చాడు .

ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య బాండింగ్ చాలా స్పెషల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే సాయి ధరమ్ తేజ్ ని ఈ సినిమాలో సెలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కాదని డైరెక్టర్ అంటూ తెలుస్తుంది . ఈ కథ ప్రకారం హీరోకి యాక్సిడెంట్ అవుతుంది . ఆ తర్వాత తన లైఫ్ మారిపోతుంది. సాయి ధరంతేజ్ కూడా రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది . ఆ బాధ నుంచి ఇప్పుడే బయటపడుతున్నారు. సో ఈ రోల్ కి సాయి ధరమ్ తేజ్ నే సూపర్ అని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఇరగదీయాల్సిందే అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news