Moviesచిన‌మామ బాల‌య్య చేసిన ప‌నికి తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య ఎమోష‌న‌ల్ పోస్ట్‌...!

చిన‌మామ బాల‌య్య చేసిన ప‌నికి తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య ఎమోష‌న‌ల్ పోస్ట్‌…!

నందమూరి వారసుడు ప్రముఖ హీరో తారకరత్న మృతి చెంది నెల రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఆయన లేరన్న విషయాన్ని నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి, ముఖ్యంగా తారకరత్న మరణంతో మిగిలిన వారి సంగతి ఎలా ? ఉన్నా ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం తట్టుకోలేకపోతున్నారు, కేవలం 40 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్తు ఉండి కూడా తన భర్త లేడ‌ని… ఆమె అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్టులు పెడితు వస్తున్నారు. తాజాగా తన భర్త అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పటినుంచి మృతి చెందాక కూడా చిన్న మామ బాలయ్య చేసిన.. సాయాన్ని గుర్తు చేసుకుంటూ అలేఖ్య ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన.. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడ్డారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు తండ్రిలా.. నీ బెడ్ పక్కనే కూర్చుని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా ..నువ్వు రియాక్ట్ అవుతావేమో అని నిన్ను నవ్వించుట కోసం జోకులు వేస్తూ సరదాగా కనిపించి.. ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు.

చివర క్షణం వరకు నీకోసం చేయాల్సింది అంతా చేశారు. ఓబు ( తారకరత్న ముద్దు పేరు ) నువ్వు ఇంకొంత కాలం ఉంటే బాగుండేది నిన్ను చాలా మిస్ అవుతున్నాం అని అలేఖ్య రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్ చేసి ఎవరో ఆ ఫోటోను అలేఖ్య రెడ్డికి పంపగా ఇది ఎంతో బాగుందని ఆమె ప్రశంసలు కురిపించింది. ఇదిలా ఉంటే బాలయ్యకు తన అన్న కుమారుడు తారకరత్న అంటే ఎంతో ఇష్టం.

తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహానికి తారకరత్న కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అలాంటి సమయంలో బాలయ్య వాళ్లకు తోడుగా ఉండి భరోసా ఇచ్చి మళ్లీ తారకరత్నను నందమూరి కుటుంబానికి దగ్గర చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని తారకరత్న కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా తన చినమామ బాలయ్య తన భర్త కోసం పడిన కష్టాన్ని ఇలా ఎమోషనల్ పోస్టుతో తెలియజేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news