Moviesకృష్ణం రాజు ఫ్యామిలీలో గొడవలు.. ప్రభాస్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న...

కృష్ణం రాజు ఫ్యామిలీలో గొడవలు.. ప్రభాస్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న శ్యామలా దేవి..!?

టాలీవుడ్ సీనియర్ హీరోగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణంరాజు.. ఇప్పుడు మన మధ్య లేడు అన్న విషయం అందరికీ తెలిసిందే . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబెల్ హీరో కృష్ణంరాజు ఎలాంటి సినిమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో ఆయన నటించిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు గా బాక్సాఫీస్ వద్ద నిలిచాయి. సీనియర్ పాత్రలు చేసినప్పుడు కూడా కృష్ణంరాజు ఏమాత్రం తగ్గకుండా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్నాడు .

కాగా అనారోగ్య కారణంగా రీసెంట్ గానే మరణించిన కృష్ణంరాజు ఫ్యామిలీలో ఇప్పుడు కలతలు మొదలయ్యాయి అంటూ బాలీవుడ్లో న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ఇన్నాళ్లు చాలా అన్యోన్యంగా ఉన్న ప్రభాస్.. ప్రభాస్ చెల్లెలు ఇప్పుడు ఆస్తి విషయంలో తగాదాలు వేసుకుంటున్నారట . ప్రభాస్ కి డబ్బు కి కొదవలేదు . కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . అయితే కృష్ణంరాజు ఫ్యామిలీకి జాన్ జిగిడి దోస్త్ అయిన వ్యక్తి ప్రభాస్ ని.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి దూరం చేస్తి ఆస్తి నొక్కేయాలని ..పిల్లలకి ఉన్నది లేని చెప్పి.. వాళ్లను ప్రభాస్ పై రెచ్చగొట్టే విధంగా పంపుతున్నాడట.

ఈ క్రమంలోనే రీసెంట్గా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా కృష్ణంరాజు ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఉప్పలపాటి ఫ్యామిలీ పూర్తి బాధ్యతలు ప్రభాస్ కి అప్పజెప్పబోతున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో ఎవ్వరు జోక్యం అవసరం లేదని కూడా శ్యామలాదేవి ఖరాఖండిగా చెప్పేసిందిట . ప్రభాస్ పై అంత నమ్మకం ఉంది శ్యామలాదేవికి అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. సొంత కూతుర్ల కన్నా ప్రభాస్ కే సపోర్ట్ చేస్తున్నారంటే మన డార్లింగ్ ఒక మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ రెబల్ ఫాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news