టాలీవుడ్ యంగ్ టైగర్ త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ గా ఈరోజుకు ఏడాది అవుతోంది. ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగును పట్టాలు ఎక్కిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జరిపి వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/03/NTR1.jpg)
త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు.
ఈ సినిమా తర్వాత కేజీఎఫ్, సలార్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 వ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ 32వ సినిమాపై కూడా అప్పుడే క్లారిటీ వచ్చేసింది.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2022/02/ntr-prashanth-neel-1024x683.jpg)
విశేషం ఏంటంటే ప్రముఖ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎన్టీఆర్ తో ఒక భారీ ప్రాజెక్టు టేకాప్ చేయనున్నాడు. ఎన్టీఆర్ 30వ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన ప్రత్యేకంగా ముంబై నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. మరోవైపు ప్రభాస్, అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఎన్టీఆర్తో కూడా ఒక బడా డైరెక్టర్ తెరకెక్కించే సినిమాను ఆయన తన బ్యానర్లో నిర్మించేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2022/05/ntr31.png)
ఇందుకు ఎన్టీఆర్ కూడా ఇప్పటికే ఓకే చెప్పేసారని… త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత ఎన్టీఆర్ కు మరింత పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఆ తర్వాత భూషణ్ కుమార్ లాంటి బాలీవుడ్ నిర్మాత పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని నిర్మిస్తే మామూలుగా ఉండదని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు ఎన్టీఆర్ వెంట టాలీవుడ్ నిర్మాతలే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా పడుతున్నారు.