Moviesఅభిమానులకు శర్వానంద్ మరో గుడ్ న్యూస్..ఏం లక్ రా బాబు నీది..!!

అభిమానులకు శర్వానంద్ మరో గుడ్ న్యూస్..ఏం లక్ రా బాబు నీది..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు . రీసెంట్ గానే శర్వానంద్ తన కాబోయే భార్య రక్షిత రెడ్డికి సంబంధించిన అఫీషియల్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన పెళ్లిపై అఫీషియల్ ప్రకటన చేశాడు . రక్షిత రెడ్డి తో త్వరలోనే ఏడడుగులు వేయనున్నారని అఫీషియల్ గా ప్రకటించాడు .

ఈ క్రమంలోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోస్ గా పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి – నాగార్జున సతి సమేతంగా ..శర్వానంద్ నిశ్చితార్ధ వేడుకకు హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ – ఉపాసనతో ఈ ఫంక్షన్ కి వెళ్లి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు .

కాగా రీసెంట్గా శర్వానంద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు . మార్చి నుంచి తన కొత్త చిత్రాన్ని పట్టాలకించేందుకు సిద్ధమవుతున్నాడు శర్వానంద్ . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఓ సినిమాలో హీరోగా నటించనున్నాడు శర్వానంద్ . కాగా ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమాకు ఫిక్స్ అయ్యారు . 118 చిత్ర డైరెక్టర్ గుహాన్ తో శర్వా సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందించాడు శ్రవా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news