Moviesవీరసింహా రెడ్డి సినిమా కి ఉన్న ప్లసే..వీరయ్య కు మైనస్ అయ్యిందా..?

వీరసింహా రెడ్డి సినిమా కి ఉన్న ప్లసే..వీరయ్య కు మైనస్ అయ్యిందా..?

ఎన్నడూ లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టఫ్ ఫైట్ ఇచ్చారు ఇద్దరు స్టార్ హీరోలు . టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ గా పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి .. అలాగే నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వారు నటించిన సినిమాలను రిలీజ్ చేశారు. మరీ ముఖ్యంగా ఓ సినిమా రిలీజ్ అయిన 24 గంటల లోపే మరో సినిమా రిలీజ్ చేయడం బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్గా మారింది.

అయితే రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో నందమూరి ఫ్యాన్స్ .. మెగా ఫాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు . అయితే వీరసింహారెడ్డి తో కంపేర్ చేస్తే వల్తేరు వీరయ్య కలెక్షన్స్ పరంగా టాక్ పరంగా కొంచెం వెనకడుగు వేసింది. మొదటిరోజు వీరసింహారెడ్డి 54 కోట్లు కలెక్ట్ చేస్తే ..వాల్తేరు వీరయ్య మాత్రం 29 కోట్లతోనే సరిపెట్టుకుంది . ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరసింహారెడ్డిలో పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్ లో వాడుకునేశాడు గోపీచంద్ మలినేని .

ప్రజెంట్ ఉన్న సిచువేషన్ కి పాలిటిక్స్ ని కలుపుతూ పరోక్షంగా ఎవరికి తగలలో వారికి తగిలే విధంగా గోపీచంద్ మలినేని డిజైన్ చేసిన క్యారెక్టర్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. గోపీచంద్ మలినేని వీర సింహారెడ్డి సినిమా విషయంలో కేర్ తీసుకున్నాడు. అయితే వాల్తేరు వీరయ్య విషయం వచ్చేసరికి ఓన్లీ కామెడీ మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రధానంగా తీసుకున్నారు. అది తప్పిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు . సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ మెగాస్టార్ కావడం ..ఈ సినిమాకి మైనస్ గా మారితే.. పవర్ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ వీరసింహారెడ్డికి ప్లస్ గా మారాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news