Moviesమ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌థ విని నిద్ర‌పోయిన ప‌వ‌న్‌... ఆ సినిమా ఏదో...

మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌థ విని నిద్ర‌పోయిన ప‌వ‌న్‌… ఆ సినిమా ఏదో తెలుసా…!

సినిమా రంగంలో ఓ హీరో చేయాల్సిన క‌థ‌తో మ‌రో హీరో సినిమా చేసి హిట్లు కొట్ట‌డం కామ‌న్‌. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు చేసిన ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిస్ అయిపోయాడు. ఆ సినిమా ఏదో కాదు అత‌డు. మ‌హేష్‌బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు సినిమా వ‌చ్చింది. జ‌యభేరి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ముర‌ళీ మోహ‌న్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌.

వెండితెర‌పై బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాక‌పోయినా ఈ సినిమా బుల్లితెర మీద ఎప్పుడు వ‌చ్చినా కూడా అదిరిపోయే రేటింగ్ తెచ్చుకుంటూ ఉంటుంది. నిజంగా బుల్లితెర‌పై అత‌డు పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అనుకోవాలి. అయితే అత‌డు సినిమా క‌థ‌ను త్రివిక్ర‌మ్ ముందుగా ప‌వ‌న్‌కే చెప్పాడ‌ట‌.

త్రివిక్ర‌మ్ క‌థ చెప్ప‌డం స్టార్ట్ చేశాక 10 నిమిషాల‌కే ప‌వ‌న్ నిద్ర‌పోయాడ‌ట‌. ఆ త‌ర్వాత అదే క‌థ‌తో అప్పుడు స్టార్ హీరోగా ఉన్న దివంగ‌త ఉద‌య్‌కిర‌ణ్‌తో సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఉద‌య్‌కిర‌ణ్ కూడా జ‌య‌భేరి బ్యాన‌ర్లో ముర‌ళీమోహ‌న్‌కు ఓ సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే అప్పుడు ఉద‌య్ ఉన్న బిజీ వ‌ల్ల ఈ సినిమా చేయ‌డం కుద‌ర్లేదు.

ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ నాని సినిమా షూటింగ్‌లో ఉన్న మ‌హేష్‌బాబును క‌లిసి అత‌డు క‌థ చెప్పారు. క‌థ విన్న‌వెంట‌నే మ‌హేష్‌కు సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌న్న కాన్ఫిడెన్స్ వ‌చ్చేసింది. వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అలా సినిమా ఓకే అయ్యాక త్రిష‌ను హీరోయిన్గా తీసుకున్నారు. 2005లో సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఉద‌య్‌కిర‌ణ్ మాత్రం తాను తీసుకున్న అడ్వాన్స్ రిట‌ర్న్ ఇచ్చేశాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news