Moviesబ్రహ్మాస్త్ర షూటింగ్ లో ఆయనకు ఎప్పుడు అదే పని..రణబీర్ పరువు తీసేసిన...

బ్రహ్మాస్త్ర షూటింగ్ లో ఆయనకు ఎప్పుడు అదే పని..రణబీర్ పరువు తీసేసిన హాట్ బ్యూటి..!!

బ్రహ్మాస్త్ర బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ అద్భుత విజువలైజేషన్ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ హిట్ ని అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ బీర్ కపూర్.. ఆయన భార్య ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున, అమితాబచ్చన్, షారుక్ ఖాన్.. కీలక పాత్రలో నటించి మెప్పించారు.

కాగా ఈ సినిమాలో మౌని రాయి మెయిన్ విలన్ గా కనిపించింది. మౌని రాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సీరియల్స్ లో విలన్ పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె పేరుకే విలన్ చూడడానికి మాత్రం హాట్ హీరోయిన్ లా ఉంటుంది. కాగా బ్రహ్మాస్త్ర సినిమా సక్సెస్ కారణంగా ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది .అంతేకాదు ఆ వ్యాఖ్యలతో యంగ్ హీరో రణబీర్ కపూర్ పరువు తీసిన్నట్లైంది.

మనకు తెలిసిందే నాగార్జున అంటే ఓ మన్మధుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆడవారు గుంపుగా ఉండడమే. అంతటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నాగార్జున. కాగా బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ టైంలోనూ అంతేనట. ఆయన ఉంటే మాత్రం సెట్టు మొత్తం అమ్మాయిలు అంతా ఆయన చుట్టే ఉండేవారట. ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లు అంటూ సరదాగా కబుర్లు చెప్పేవారట. అంతేకాదు ఆయన స్టార్ హీరో అని స్టేటస్ ఏమాత్రం లేదట.

సరదాగా నవ్వుతూ అందరితో పలకరిస్తూ కబుర్లు చెప్పుకొచ్చేవాడు అని.. రణబీర్ కపూర్ ఏమో ఆలియాతో ఉంటే.. నాగార్జున మాత్రం సెట్స్ లో ఉండే అందరితో చాలా సరదాగా ఉండే వారిని నాగార్జునతో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని మౌని రాయి చెప్పుకొచ్చింది. దీంతో ఆ ఒక్క మాటతో నాగార్జున ట్రెండింగ్ లోకి వచ్చాడు రణబీర్ కపూర్ పరువు పరోక్షంగా తీసిన్నట్లైంది మౌని రాయ్ అంటున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news