Moviesబిగ్ షాకింగ్: కృతి కొంప ముంచేసిన అమ్మ గారు .. కోలుకోలేని...

బిగ్ షాకింగ్: కృతి కొంప ముంచేసిన అమ్మ గారు .. కోలుకోలేని దెబ్బ..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇప్పటికే బోలెడు మంది హీరోయిన్స్ విషయాల్లో ఇలానే జరిగిన.. రీసెంట్ గా.. కన్నడ బ్యూటీ కృతిశెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీ కళ్ళని తన వైపు తిప్పుకునేలా చేసింది.ఇక తర్వాత నాని శ్యాంమ్ సింగరాయ్.. నాగార్జున , నాగచైతన్య బంగార్రాజు సినిమాలో అవకాశాలు అందుకుంటూ వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.

ఇన్ని హిట్ లు పదితే మన వాళ్ళు ఊరుకుంటారా.. నో వే అమ్మడు కాల్ షీట్లను కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ బుక్ చేసుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు మన దర్శక నిర్మాతలు. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన మిగతా సినిమా హిట్ అవ్వాలని లేదు కదా. దీంతో కృతి నుంచి వచ్చిన రామ్ దివారియర్ సినిమా ..నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఈ సినిమా కలెక్షన్స్ చూసి నిర్మాతలకు కడుపు మండిపోయింది. అంత దారుణంగా ఉన్నాయి.

అయితే ఈ రెండు సినిమాలకు కృతి చేసిన ఏకైక తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి కృతి రెమ్యూనరేషన్ విషయంలో ఏనాడు కండిషన్స్ పెట్టలేదట. డైరెక్టరస్ నిర్మాతలు ఎంత చెప్తే అలానే వచ్చిందట. ఉప్పెన సినిమాకు, బంగార్రాజు సినిమాకు, నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు కృత్తి ఇలానే చేసిందట. కానీ మూడు సినిమాలు హిట్ అయ్యాక రెమ్యూనరేషన్ పెంచకపోతే ఇండస్ట్రీలో మనల్ని గుర్తించారు అంటూ వాళ్ళ అమ్మగారు చెప్పారట.

అంతే.. దివారియ సినిమాకు ఉన్న ఫలంగా కోటి 50 లక్షలు రెమ్యూనరేషన్ పెంచేసిందట. సేమ్ అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం కూడా అమ్మడు ఏకంగా కోటి రూపాయలు అదనంగా తీసుకుందని టాక్. ఆ టైంలో నిర్మాతలు పడిన బాధలే.. కృతి పాలిట శాపంగా మారింది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి కృతి శెట్టి నెక్స్ట్ సినిమా అయినా హిట్ కొడుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news