Moviesసాయిప‌ల్ల‌విని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఇంత లైట్ అయిపోయిందా...!

సాయిప‌ల్ల‌విని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఇంత లైట్ అయిపోయిందా…!

ఇండస్ట్రీలో ఎంత టాలెంటెడ్ హీరోయిన్ అయినా సక్సెస్‌లు లేకపోతే తీసి పక్కన పెట్టేస్తారు. అలాంటిది ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా, గ్లామర్ పాత్రలకు నో చెబుతూ..హీరోలతో రొమాన్స్ అంటే సారీ అనే హీరోయిన్స్ ఎంతకాలం నెట్టుకొస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, సాయి పల్లవి లాంటి నేచురల్ పర్ఫామర్ మాత్రం ఇవేవి చేయకుండానే నెట్టుకొస్తుంది. అంతేకాదు, ప్రత్యేకంగా సాయి పల్లవికి ఓ మార్కెట్ ఉంది. సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి అంటే సగం బిజినెస్ అయిపోతుంది.

అంతటి క్రేజ్ తెలుగులో తెచ్చుకుంది. అయితే, అమ్మడికి క్రేజ్ ఎంత ఉన్నా అదేంటో గానీ, సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోవడం లేదు. తెలుగులో ఆమె నటించిన సినిమాలు ఫిదా, ఎంసిఏ, పడిపడి లేచేమనసు, లవ్ స్టోరి, విరాట పర్వం. వీటిలో రెండు సినిమాలు హిట్ అయితే మూడు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇటీవల వచ్చిన విరాట పర్వం సినిమా అందరూ భారీ సక్సెస్ సాధిస్తుందని భావించారు. రానా కంటే కూడా ఈ సినిమా ప్రమోషన్స్ సాయి పల్లవి మీదే ఎక్కువ చేశారు.

తీరా చూస్తే ఇది ఓటీటీ సినిమా అంటూ పెదవి విరిచారు. ఎందుకనో సాయి పల్లవి తో పాటు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి, నందిత దాస్ ఉన్నా కూడా ఫలితం ఎక్కడో తేడా కొట్టింది. ఈ ప్రభావం సాయి పల్లవి సినిమాల మీద గట్టిగానే పడిందని ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకంటే ఆమె నటించిన తాజా చిత్రం గార్గి మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఒక్కరోజు తేడాతో రామ్మ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన ది వారియర్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

అయితే, తమిళంలో సూర్య – జ్యోతిక ఈ సినిమాను సమర్పిస్తున్నారు. రిలీజ్‌కి ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ చేస్తున్నాడు. అయినా కూడా అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ, సాయి పల్లవి గార్గి సినిమాపై బజ్ ఏర్పడటం లేదు. ఇదంతా తన గత చిత్రం ప్రభావమే అని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవళ సైలెంట్ గా హిట్ సాధిస్తే సాయి పల్లవికి మరికొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహమే లేదు. అలా కాకుండా సినిమా ఫలితం వేరేలా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news