Moviesమహేష్ కోసం రాజమౌళి బిగ్గెస్ట్ రిస్క్..ఫస్ట్ టైం సరికొత్త ప్రయోగం..సూపరో సూపర్..?

మహేష్ కోసం రాజమౌళి బిగ్గెస్ట్ రిస్క్..ఫస్ట్ టైం సరికొత్త ప్రయోగం..సూపరో సూపర్..?

టాలీవుడ్ స్టార్ సూపర్ హీరో మహేశ్ బాబు ఈ మధ్యనే “సర్కారు వారి పాట” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫాంలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేశ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే, తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ఈ హ్యాండ్ సమ్ హీరో. ఇది వరకే వీళ్ల కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాల వచ్చాయి. దీంతో ఈ కాంబో పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

ఈ సినిమా తరువాత త‌ర్వాత మ‌హేష్‌బాబు.. రాజ‌మౌళి తో ఓ సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు. మ‌హేష్‌, రాజ‌మౌళి క‌ల‌యిక‌లో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా క‌థ‌పై చాలా రోజులుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. రాజమౌళి సినిమాలు అంటే అవి విజువల్ వండర్ అని చెప్పవచ్చు. టెక్నాలజీని ఆయన వాడుకున్నంతగా మరే డైరెక్టరూ వాడుకోరు అన్నది అభిమానుల మాట. కాగా లేటెస్ట్ గా ప్యారిస్ లోని యూనిట్ ఇమేజ్ అనే ఫేమస్ 3డి యానిమేషన్ అండ్ VFX స్టూడియోను సందర్శించారు రాజమౌళి అండ్ టీమ్.

ఆ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక రాజమౌళి రాసుకొస్తూ..”పారిస్ లోని ఫేమస్ 3డి యానిమేషన్ అండ్ వ్FX స్టూడియో యూనిట్ ఇమేజ్ ని చూశాము.చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ మా ప్రతి ప్రశ్నకు వివరగా సమాధనమిచ్చారు. త్వరలోనే కలిసి పని చేయబోతున్నాము ,చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.. త్వరలోనే దీనికి సంబంధించిన వర్క్ మొదలుపెడతాం” అని పోస్ట్ చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news