Moviesసాయి పల్లవిని ఐస్ చేస్తున్న నిర్మాత..నీ పప్పులు ఉడకవు సామీ..?

సాయి పల్లవిని ఐస్ చేస్తున్న నిర్మాత..నీ పప్పులు ఉడకవు సామీ..?

సాయి పల్లవి..ఇప్పుడు ఈ పేరు చెప్పితే ఫ్యాన్స్ పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు. కేవలం నటన ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి పల్లవి మొదటి నుండి కూడా నిజాయితీ అనే ఫార్ములానే ఫాలో అవుతుంది. ఈ కాలంలో నిజాయితి పదానికి విలువ ఇచ్చే వాళ్లు తక్కువ..అలాంటిది, స్టార్ హీరోయిన్ గా ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ ని ఇష్టపడుతూ..అందరిని ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. అంతేకాదు గ్లామరస్ షోలు చెయ్యను అని ఉన్నది మోహానే చెప్పే క్యారెక్టర్ అమ్మడుది.

నిజం చెప్పాలంటే..మన ఇండస్ట్రీలో సాయి పల్లవి తో సినిమాలు చెయ్యాలనే నటులు చాలా మందే ఉన్నారు. అంతెందుకు ఏకంగా చిరంజీవినే ..లవ్ స్టోరీ సినిమా టైంలో..”నీతో ఒక్క సినిమా ప్లీజ్ సాయి పల్లవి “అంటూ అడిగేశారు. అంత బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాలని. మలయాళం ,తెలుగు, తమిళంలో మంచి పేరు సంపాదించుకున్న సాయి పల్లవి..మరి కొద్ది రోజుల్లో..”విరాట పర్వం” అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది.

అయితే, తాజాగా ఈ ట్రైలర్ చూసిన బాలీవుడ్ మల్టీ టాలెంటేడ్ నటుడు, నిర్మాత కరణ్ జోహార్ సాయి పల్లవిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ట్రైలర్ చాలా స్టన్నింగ్ గా ఉందని..సాయి పల్లవి నటన సూపర్ అని..ఆమెకు తను ఫ్యాన్ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. అయితే, దీని పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షో కి ఆమె ను ఆహ్వానించడానికే ఈ డ్రామాలు కొడుతూ..సాయి పల్లవిని కూల్ చేస్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు గుర్తు రాని సాయి పల్లవి ఇప్పుడే గుర్తు వచ్చిందా నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news