Moviesవారెవ్వా ..పాన్ ఇండియా సినిమాలో చిట్టి..పట్టాస్ పేలిందిరోయ్..!!

వారెవ్వా ..పాన్ ఇండియా సినిమాలో చిట్టి..పట్టాస్ పేలిందిరోయ్..!!

జాతి ర‌త్నాలు.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నవీన్ పోలిశె ట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా ఓవ‌ర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో మంచి కామెడి టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారుపోయిన ఈ చిట్టి..ఆ తరువాత చిన్న చితకా పాత్రలు వేసుకుంటూ వచ్చిందే కానీ..ఇప్పటి వరకు హీరోయిన్ గా చేసింది లేదు.

‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా తన నవ్వుతో, తన అల్లరితో, తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిపొయిన ఈ చిట్టి నాగార్జున , నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి..మంచిగా పాపులర్ అయ్యింది. త‌న‌ న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిన ఫ‌రియా కి డైరెక్టర్లు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదో తెలియడం లేదు. జాతిర‌త్నాలు సినిమా త‌ర్వాత ఆమెకు భారీగా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని అంద‌రూ భావించారు. కానీ అలా జరగలేదు. ఈమెను తెర పై హీరోయిన్‌గా చూసేందుకే అభిమానులు ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే చిట్టి అద్దిరిపోయే ఆఫర్ ను అందుకున్నట్లు తెలుస్తుంది. విజ‌య్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బిచ్చగాడు సినిమాతో ఇండస్ట్రీ లెక్కలను తారుమారు చేసిన విజయ్.. 80ల‌లో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫరియా ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న రావ‌ణాసుర లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఫరియా..కి ఇలాంటి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news