Moviesబాల‌య్య - పూరి పైసావ‌సూల్ చెడ‌గొట్టేందుకు ఇన్ని కుట్ర‌లు జ‌రిగాయా..!

బాల‌య్య – పూరి పైసావ‌సూల్ చెడ‌గొట్టేందుకు ఇన్ని కుట్ర‌లు జ‌రిగాయా..!

బాలయ్య తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ నటసింహం ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఎన్ని సినిమాలు చేసినా అందులో చాలా వరకు యాక్షన్ సినిమాలు.. ఫ్యాక్షన్ సినిమాలే. బాలయ్య సినిమా అంటే డైలాగులు.. ఫైట్లు తప్పక ఉండాల్సిందే. అలాంటి బాలయ్యను పైసా వసూల్ సినిమాతో చాలా సరి కొత్తగా ఆవిష్కరించిన ఘనత మాత్రం టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది. అప్పటివరకు బాల‌య్య‌ను ఒకే కోణంలో చూసిన ప్రేక్షకులు అందరూ ఆ సినిమాలో చాలా కొత్తగా చూశారు.

బాలయ్య డైలాగ్ డెలివరీతో పాటు కామెడీ టైమింగ్, టేకింగ్ అన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. పైసా వసూల్ సినిమా మరి అంత హిట్ సినిమా కాకపోయి ఉండవచ్చు… అయితే బాలయ్య అభిమానులతో పాటు బాలయ్య కూడా ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా ఒప్పుకున్నారు. హిట్లు, ప్లాపుతో సంబంధం లేకుండా ఈ సినిమాను అంద‌రూ మెచ్చుకున్నారు. ఇక పూరి జగన్నాథ్ తనతో సినిమా చేయాలని అనుకుంటే.. వెంటనే వ‌చ్చేయ‌వ‌చ్చ‌ని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశారు.

అయితే ఈ సినిమా పట్టాలు ఎక్కక‌ ముందు ఇండస్ట్రీలోని కొందరు ఎలాగైనా ఈ కాంబినేషన్ క్యాన్సిల్‌ చేయాలని చాలా పన్నాగాలు వేశారట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పారు. బాలయ్యతో సినిమా వద్దు.. ఆయనకు కోపం ఎక్కువ అని పూరీకి చాలామంది చెప్పారట. విచిత్రంగా అటు బాలయ్య కు కూడా కొందరు పూరీతో సినిమా చేయవద్దని ప్లాపుల్లో ఉన్నాడని సూచించారట. అయితే బాలయ్య మాత్రం పూరి చెప్పిన లైన్ కేవలం ఐదు నిమిషాలు విని సినిమాకు ఓకే చెప్పేశాడట. తేడా సింగ్ అన్న క్యారెక్టర్ గురించి కూడా పూరి.. బాలయ్యకు చెప్పలేదట. వారం రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చి అన్ని సీన్లు చెబుతాను అని అంటే… బాలయ్య మీ సినిమాలు నేను చాలా చూశాను.. అవసరం లేదు డైరెక్ట్ గా షూటింగ్‌కు వెళ్ళిపోదామని చెప్పేశారట.

బాల‌య్య ఒక డైరెక్టర్ ను నమ్మి సినిమా చేస్తారని.. ఆయన డైరెక్టర్ల హీరో అని… డైరెక్టర్ల‌తో పాటు టెక్నీషియన్లకు ఎంతో విలువ ఇస్తారని పూరి.. బాలయ్య గురించి గొప్పగా చెప్పారు. ఇక ఈ సినిమా తర్వాత కూడా పూరి చాలాసార్లు తాను బాలయ్యతో సినిమా చేయాలని అనుకుంటే.. బాలయ్య కథ వినకుండానే తనకు డేట్లు ఇచ్చేస్తారు అని కూడా చెప్పారు. ఒకదశలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు సైతం పూరీ జగన్నాథ్ పేరు వినిపించింది. పూరి మాత్రం బాలయ్యతో మరో సినిమా చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ? వ‌ర్క‌వుట్‌ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news