Moviesనిర్మాత‌గా ఆస్తులు పోగొట్టుకుని.. అలా మారిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్‌..!

నిర్మాత‌గా ఆస్తులు పోగొట్టుకుని.. అలా మారిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్‌..!

సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సినిమా రంగంలో హీరోలకు లాంగ్ ర‌న్ ఉంటుంది. హీరోలు 30 – 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారు. వారికి లక్షల్లో అభిమానులు ఉంటా.రు హీరోయిన్లు అలా కాదు ఎంత పెద్ద హీరోయిన్ అయినా పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉంది అంటే గొప్ప విషయమే. సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల్లో చూస్తే అనుష్క – నయనతార లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగారు.

హీరోయిన్లు ఫామ్ లో ఉన్నప్పుడే ఎక్కువ డిమాండ్ చేస్తూ నాలుగురాళ్లు వెనకేసుకోవాలి. ఇలాంటి టైమ్ లో ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా కెరీర్లో పాతాళానికి పడిపోతారు. మహానటి సావిత్రి తన జీవితంలో ఎంత గొప్ప జీవితం చూసిందో… ఆమె చేసిన తప్పులతో ఆమె అంత‌ పతన జీవితం కూడా చూసింది. సావిత్రి ఆర్థికంగా నష్టపోవడానికి విప‌రీత దాన‌ధ‌ర్మాల‌తో పాటు ఆమె నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసి అవి ప్లాప్‌ అవటం కూడా ఓ కారణం. సావిత్రి సంగతి ఇలా ఉంటే పవర్‌స్టార్ ప‌వన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దేవయాని కూడా సావిత్రి తరహా తప్పులతోనే ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్లి పోయింది.

1993లో ఓ బెంగాలీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన దేవయాని… ఆ తర్వాత కోలీవుడ్లో బాగా బిజీ అయిపోయింది. అప్పట్లో కోలీవుడ్ లో స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులోనూ సుస్వాగతంతో పాటు శ్రీకాంత్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళంలోనూ బిజీ అయ్యింది. అన్ని భాషల్లోనూ కలిపి 90కు పైగా సినిమాల్లో నటించింది. ఆమె నటించిన కొన్ని సీరియల్స్ అయితే ఇప్పటికీ ఆమెకు బుల్లితెర పై వేలాది మంది అభిమానులను సొంతం చేశాయి. దేవయాని అసలు పేరు సుష్మ. ఆమె జీవితం మొత్తం సాంప్రదాయబద్ధమైన పాత్రలలో నటించి మెప్పించింది.

హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలను కన్న దేవయాని… ఫ్యామిలీకు టైం కేటాయించడంతో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించాలని నిర్మాతగా మారి కొన్ని సినిమాలు నిర్మించింది. ఆ సినిమాల‌ కథల ఎంపికలో ఆమె చేసిన తప్పు లతో అవన్నీ ప్లాప్‌ అయ్యాయి. దీంతో తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకుని ఆర్థికంగా ఎదురు దెబ్బలుతిన్న దేవయాని చివరకు చెన్నైలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా పనిచేసింది.

ఆ తర్వాత ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలు వెతుక్కుంటూ అవకాశం రావడంతో మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటోంది. జనతా గ్యారేజ్ – అరవింద సమేత లాంటి సినిమాల్లో నటించిన దేవయాని ఇప్పుడు మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీబిజీగా కొనసాగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news