Moviesఇన్నాళు ఒక్క లెక్క..ఇప్పటి నుండి ఒక్కలెక్క..వారసుడొచ్చాడురోయ్..?

ఇన్నాళు ఒక్క లెక్క..ఇప్పటి నుండి ఒక్కలెక్క..వారసుడొచ్చాడురోయ్..?

సినీ ఇండస్ట్రీలోకి వారసులు రావడం చాలా కామన్. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు..పక్క బాష ఇండస్ట్రీలల్లో కూడా తండ్రి పేరు చెప్పుకుని కొందరు..తాతల పేరు చెప్పుకుని కొందరు ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేళుతున్నారు. ఇక హీరోయిన్లు కూడా ఈ మ్యాటర్ లో ఏం తక్కువ కాదు. అక్క హీరోయిన్ గా సక్సెస్ అయితే చెల్లిని దింపుతున్నారు ఇండస్ట్రీలోకి. ఇక కన్నడ ఇండస్టృఈలో అయితే బడా బడా రాజకీయ నాయకుల కొడుకులు కూడా హీరో గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

కర్నాటకలో ఇప్పతీకే చాలామంది ప్రముఖుల కొడుకులు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. కొందరు ఫ్లాప్ అవ్వగా..మరికొందరు సక్సెస్ అయ్యారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్.. కన్నడ ఇంస్ట్రీలో తమదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక మాజీ మంత్రి, సౌత్‌లో అందరికీ తెలిసిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కూడా తన ఫేట్ టెస్ట్ చేసుకోవడానికి త్వరలోనే వెండితెరపై అరంగేట్రం చేయనున్నారు.

జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరో కావాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని తండ్రితో చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక సినిమా ఇండస్ట్రీలోకి రావడాని యాక్టింగ్, డ్యాన్స్ బాగా నేర్చుకుని..ఫైనల్ గా మంచి స్క్రిప్ట్ తో మైనింగ్​ కింగ్​ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి. త్వరలోనే సినిమా రంగ ప్రవేశం చేయనున్నట్లు డైరెక్టర్​ రాధాకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ దర్శకుడు కన్నడలో ‘మాయాబజార్’ అనే మూవీ తెరకెక్కించాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘జాకీ’ మూవీ ఇన్సిరేషన్‌తోనే కిరీటి ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. పీఆర్​కే బ్యానర్​లో కిరీటిని పరిచయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకోనుందఅట. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news