Moviesకిలోమీటరు దూరం పరుగెత్తిన ప్రభాస్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!!

కిలోమీటరు దూరం పరుగెత్తిన ప్రభాస్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!!

ప్రభాస్‌.. ఈ పేరు వింటేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకప్పుడు చిన్న సినిమాలతో మొదలు పెట్టిన ఈయన కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ గా కొనసాగుతుంది. ఈ టాలీవుడ్‌ హీరో బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన్ డార్లింగ్.. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకునారు. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఆయ‌న ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. అయితే ఇంతటి భారీ ఫాలోయింగ్ కు కారణం బాహుబ‌లి సినిమానే అని చెప్పక తప్పదు. అది మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన చేతినిండా బడా సినిమాలతోనే బిజీ బిజీ గా ఉన్నారు.రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌,సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఇక బాహుబలి సిరీస్‌తో తెలుగు ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన ఈ హీరో ఒక్క సినిమా కోసం ఏకంగ కిలోమీటరు దూరం పరుగెత్తాడట. ఇప్పుడు ఆ విషయమే నెట్టింట వైరల్ గా మారింది.

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ఇండియా సినిమా ల‌వ‌ర్స్ ఎంత ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.యూర‌ప్ నేప‌థ్యంలో కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ హైలెట్ సీన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాలో దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేసి మేకర్స్ జార్జియాలో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో 150 మంది వ్యక్తులు కలిసి 10 రోజుల పాటు భారీ ఫ్లీ మార్కెట్ సెట్‌ను నిర్మించారట. ఈ సెట్ లో మేకర్స్ ఛేజ్ సీక్వెన్స్‌ని సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు. ఫ్లీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో జార్జియాలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ఎక్కడా ఆగకుండా కిలోమీటరు దూరం పరుగెత్తాల్సి వచ్చిందట. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news