Gossipsఆ సినిమా స్టోరి విని ఏడ్చేసిన హీరోయిన్ తల్లి.. ఎందుకంటే..??

ఆ సినిమా స్టోరి విని ఏడ్చేసిన హీరోయిన్ తల్లి.. ఎందుకంటే..??

యంగ్ హీరో నితిన్, అందాల తార రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. పెళ్లి విశిష్టతని తెలియజేసే అంశతో ఈ చిత్ర కథ రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం బాగా కట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న రాసిన సంభాషణలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా సాగడం, వివాహానికి సంబంధించిన సన్నివేశాలు అందంగా ఉండడంతో, పాటల చిత్రీకరణ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశాలు.

ఇక ఈ సినిమా విడుదలైన తరువాత .. శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుగు పెళ్లి తంతుల పరమార్థం తెలిసిందని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు.. తదితర విషయాలను శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుసుకున్నానని రాశీ తెలిపింది. సినిమా చేస్తున్నంతసేపు తానూ ఓ తెలుగు అమ్మాయిలానే ఫీల్‌ అయ్యానని చెప్పుకొచ్చింది.

ఇక ఈ సినిమా కథ విన్న రాశి ఖన్నా తనకు నచ్చడమే కాకుండా ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పిందట. కథ విన్న రాశి మదర్ కన్నీళ్లు పెట్టుకున్నారట. మనసులను కదిలించే సినిమాలు.. కథలు రావడం అరుదు.. అలాంటి వాటిలో శ్రీనివాస కళ్యాణం ఒకటని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దిల్ రాజు రాశి ఖన్నాని ప్రిఫర్ చేయగా.. సతీష్ వద్దని అన్నారట. కాని ఆమె నటించిన తొలిప్రేమ సినిమా తర్వాత ఆమెను ఓకే చేయడం జరిగిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news