Moviesనందమూరి అభిమానులకు ఇక పండగే పండగా..ఎందుకు అనుకుంటున్నారా.. ఇది చూడండి..!!

నందమూరి అభిమానులకు ఇక పండగే పండగా..ఎందుకు అనుకుంటున్నారా.. ఇది చూడండి..!!

నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఇప్పటికే 100కి పైగా సినిమాలు చేసి నేటికీ అదే హవా నడిపిస్తున్న ఆయన.. ఇక తన కొడుకు మోక్షజ్ఞను కూడా రంగంలోకి దించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి 5సంవత్సరాలుగా రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలు వచ్చినప్పుడల్లా నందమూరి అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోతున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ బాలయ్య కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ పై ఆశక్తికర చర్చలు మొదలయ్యాయి. నిజానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు నడుస్తుండగా ఇటీవలే ఆయన సినీ ఎంట్రీ ఉంటుందని కన్ఫమ్ చేశారు బాలయ్య బాబు. అది కూడా టాలీవుడ్ చరిత్రలో ఓ చెరిగిపోని, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు.

అయితే నందమూరి వారసుడి ఎంట్రీ విషయంలో మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మోక్షజ్ఞను తెర మీద చూడాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

టాప్ హీరోల వారసులు అంతా ఇప్పటికే క్రేజీ హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పరిస్థితులలో బాలయ్య కొడుకు నిజంగానే సినిమా ఎంట్రీ ఇస్తే నందమూరి అక్కినేని కుటుంబాల మూడవ తరం హీరోల సందడితో ఇండస్ట్రీ వాతావరణం వేడెక్కిపోతుంది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news