Moviesసుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్‌... దిశ చ‌నిపోయాక కూడా 9 రోజులు...

సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్‌… దిశ చ‌నిపోయాక కూడా 9 రోజులు ఫోన్ వాడింది ఎవ‌రు…!

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ కేసు విచార‌ణ‌లో రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిశ దిశా సాలియన్ సుశాంత్ కంటే ముందు ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఓ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఒక భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడి నుంచి కూడా ఆమె మరణం సందేహంగానే ఉంది. అయితే దిశ మృతి చెందిన త‌ర్వాత కూడా ఆమె ఫోన్ 9 రోజుల పాటు ప‌నిచేసింది. ఆమె ఫోన్ వాడుక‌లోనే ఉంది. ఈ ఫోన్ నుంచి ఇంట‌ర్నెట్ కాల్స్ వెళ్లాయి. అయితే ఈ ఫోన్ ఎవ‌రు వాడారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. ఇక ఫోరెన్సిక్  విచారణకు కూడా ఫోన్ ఇవ్వలేదు అని గుర్తించారు.

దిశ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఈ ఫోన్ సుశాంత్ వాడాడా ?  లేదా ?  రియా వాడిందా ? అన్న సందేహాలు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి. ఇక సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రియాకు మహేష్ భట్ సహకరించారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కేసులో రియాను ఎప్పుడు అయినా అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news