Moviesఖుషిలో ' భూమిక న‌డుము ' మెర‌వ‌డానికి ద‌ర్శ‌కుడు ఏం చేశాడో...

ఖుషిలో ‘ భూమిక న‌డుము ‘ మెర‌వ‌డానికి ద‌ర్శ‌కుడు ఏం చేశాడో తెలుసా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను స్టార్ గా నిలబెట్టిన సినిమాల్లో మాత్రం ఖుషి సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యాన‌రిజం స్టైల్ యూత్ కు తెగ‌న‌చ్చేశాయి. ఈ సినిమాకు ఎస్ జే.సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీగా భూమిక చావ్లా హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా వ‌చ్చి 20ఏళ్లు అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీ లో వ‌స్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఆ రోజుల్లోనే 105 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. యూత్‌లో ప‌వ‌న్‌ను ఈ సినిమా తిరుగులేని స్టార్‌ను చేసింది.

ఖుషి సినిమాలో చాలా సీన్ లు ఇప్ప‌టికీ కూడా సోష‌ల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ సినిమాలో ఆలీ క‌మెడియ‌న్ గా న‌టించగా ప‌వ‌న్ – ఆలీ మ‌ధ్య ఉండే కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్వించాయి. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ భూమిక కొట్లాడుకోవ‌డం…. ఒక‌రిపై ఒక‌రు అరుచుకోవ‌డం కూడా ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చింది. ముఖ్యంగా ఖుషి సినిమా గుర్తుకు వ‌స్తే ప్రేక్ష‌కుల‌కు మొద‌ట‌గా గుర్తుకు వచ్చేది మాత్రం భూమిక నడుము సీన్. ఈ సీన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భూమిక న‌డుము చూస్తాడు. దాంతో భూమిక నువ్వు నా న‌డుం ఎందుకు చూశావ్ ? అంటూ వాదించ‌డం మొద‌లు పెడుతుంది.

 

కానీ ప‌వ‌న్ మాత్రం నేను చూల్లేదు అంటూ ద‌బాయిస్తూ ఉంటాడు. సినిమాకే ఈ సీన్ హైలెట్ గా నిలిచింది. అసలు ఈ సినిమా విజ‌యంలో ఈ సీనే కీల‌క పాత్ర పోషించింది. ఈ సీన్ కోస‌మే అప్ప‌ట్లో సినిమా చూసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ సీన్‌ను అంత బాగా పండించాడు ప‌వ‌న్. ద‌ర్శ‌కుడు సూర్య కూడా అంతే బాగా డిజైన్ చేశాడు. ప‌వ‌న్ బొడ్డును చూడ‌డం.. భూమిక కొస‌రు కొస‌రు కోపం సీన్ బాగా పండేందుకు కార‌ణ‌మ‌య్యాయి.

ప్ర‌స్తుతం వ‌స్తున్న చాలా సినిమాల‌లో ఈ సీన్‌ను రిఫ‌రెన్స్ గా తీసుకుంటున్నారంటే ఆ సీన్ క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే ఈ సీన్ కోసం ద‌ర్శ‌కుడు సూర్య‌ ప‌డిన క‌ష్టం అంతా ఇంతాకాదు. ఖుషి త‌మిళ వ‌ర్ష‌న్ లో న‌డుం సీన్ కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దాంతో ఎస్‌జె.సూర్య భూమిన న‌డుం సీన్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. సీన్ పండాలంటే న‌డుం మెరిసి పోవాలి. కాబ‌ట్టి అందుకోసం సూర్య పియ‌ర్స్ స‌బ్బుతో భూమిక న‌డుమును అదే ప‌నిగా రుద్దించాడ‌ట‌.

అలా స‌బ్బు పూర్తిగా అరిగిన త‌ర‌వాత ఈ సీన్ తీశార‌ట‌. ఇక ఈ సీన్ లో భూమిక న‌డుం అందం… బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూప‌ర్ గా ఉండ‌టంతో థియేట‌ర్ లో విజిల్స్ వినిపించాయి. అలా మొత్తానికి ఎస్ జే సూర్య అనుకున్న‌ది సాధించాడు. అందుకే ఈ సినిమా వ‌చ్చి రెండేళ్లు అవుతున్నా సీన్ ఇప్ప‌ట‌కీ చాలా కొత్త‌గానే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news