సినిమాకు కాస్త బజ్ ఉండాలి కానీ కొనేవాళ్లు పరిగెత్తుకు వస్తారు.. విరూపాక్ష సినిమాతో ఒకసారిగా టాలీవుడ్ దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. తర్వాతి సినిమాను సైతం మళ్ళి అదే మిస్టేక్ థ్రిల్లర్ జానర్లో నాగచైతన్య హీరోగా ప్రారంభించాడు. ఈ సినిమా జస్ట్ 10 శాతం మాత్రమే పూర్తయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ హక్కులు హోల్సేల్గా అమ్ముడుపోయాయి. ఏపీ – సీడెడ్ – నైజాం ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ ఎలా అన్ని ప్రాంతాల థియేటర్ హక్కులు కలిపి హోల్సేల్గా సితార సంస్థ తీసేసుకుంది. సితార సంస్థ నాగవంశీ రు. 34 కోట్ల రూపాయలకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. 34 కోట్లు అంటే నిర్మాతకు మంచి డీల్..!అయితే ఎక్కడ చాలా లెక్కలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి కావటానికి మరో ఏడాది టైం పెట్టే అవకాశం ఉంది. నాగ వంశీ కనీసం సగం పేమెంట్ అయిన ఇచ్చి అట్లిస్ట్ ఒక సంవత్సరం పాటు ఎదురు చూపులు చూడాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ లెక్కలు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా లేదన్న నాగ వంశీ 40 – 42 కోట్ల మధ్యలో ఈ సినిమాపై పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. అయితే నాగచైతన్య సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ మాత్రం వసూల్ కావటం పెద్ద కష్టం కాదు.
పైగా సినిమాపై మంచి బజ్ ఉంది. అయితే ఇక్కడే మరో షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది. జాక్ సినిమా కొన్న వాళ్ళు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే జాక్ సినిమా బాకీలు వసూలు చేసుకోవడానికి ఆధారం నాగచైతన్య సినిమా నే.. అలాంటిది ఈ సినిమాను ముందుగా పెద్ద పార్టీ అయినా సితారకు అమ్మేశారు అని తెలిస్తే జాక్ సినిమా కొన్నవాళ్లంతా ఎలాంటి స్టెప్పులు వేస్తారో చూడాలి.
నాగచైతన్య సినిమా హోల్సేల్… సితార ఎన్ని కోట్లకు కొందంటే..?
