టాలీవుడ్ యంగ్టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తోన్న వార్ 2 సినిమా ఆగస్టులో రిలీజ్కు రెడీ అవుతోంది. వార్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ ఉంటుంది. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసే దేవర 2.. ఆ తర్వాత బుచ్చిబాబు సానా సినిమా ఉంటుంది. ఇక ఇప్పుడు యావత్ ఇండియన్ సినీ అభిమానుల కళ్లు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా మీదే ఉన్నాయి.
అయితే ఈ సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని అప్డేట్లు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఫస్ట్ షెడ్యూల్ మొదలవ్వగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు అధికారికంగా అప్డేట్ ఇచ్చేశారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పెడుతున్నట్టు కూడా టాక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇంత స్పీడ్ గా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మంచి జోష్లో ఉన్నారు.ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్తో కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.