రాజమౌళి లాగానే అపజయం ఎరుగని ప్రయాణం చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. `సంక్రాంతికి వస్తున్నాం`తో రూ.300 కోట్ల సినిమా తీయడంతో యావత్ ఇండియన్ సినిమా జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఎలాంటి పాన్ ఇండియా హంగామా లేకుండా ఓ రీజనల్ సబ్జెక్టును తీసుకుని.. వెంకటేష్ లాంటి రీజనల్ హీరో… అందులోనూ సీనియర్ హీరోను పెట్టి.. ఓ కామెడీ, ఫ్యామిలీ సబ్జెక్టుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో రు. 300 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు.ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి.. చిరుతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి బాలయ్యతో జట్టు కట్టబోతున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబోలో ‘భగవంత్ కేసరి’ సినిమా వచ్చింది. అది మంచి హిట్టు. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని వెండి తెరపై చూడబోతున్నాం అట. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పాత్ర చాలా సెటిల్గా ఉంటుంది. అప్పటి వరకు బాలయ్యను ఎవ్వరూ చూపించని విధంగా అనిల్ చూపించాడు.
ఇక ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో బాలయ్యతో వన్స్మోర్ అనిల్ రావిపూడి అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2026 సంక్రాంతి తరవాతే.. బాలయ్య సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తారు. మధ్యలో ఎఫ్ 4 సినిమా చేయాలన్న ఆలోచన కూడా అనిల్ రావిపూడికి ఉంది.