ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన వార్తలు తెగ వినిపిస్తూన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో షూట్ మొదలు పెట్టారని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా బన్నీ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. మొదట ‘ జాన్వి కపూర్’ పేరు గట్టిగానే వినిపించగా.. ఇప్పుడు ‘మృణాల్ ఠాకూర్’ కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు గ్లోబల్ బ్యూటీ ‘దీపిక పదుకొనే ‘పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది.కాగా.. తాజగా అవన్నీ రూమర్లే అని తేలిపోయింది. ఇప్పుడు మూడో హీరోయిన్ గా ‘అనన్య పాండే’ పేరు తెగ ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ సినిమాలో స్పెషల్ టాలెంట్ చూపించబోతున్నాడు అని.. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ..రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇదే నిజమైతే అల్లు ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అందినట్లే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బన్నీ కెరీర్లోనే మంచి గుర్తింపు తెచ్చే సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ. 600 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించనునట్లు సినీ వర్గాల విశ్లేషణ. అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ రెమ్యునరేషనే రూ.250 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది.
బన్నీ – అట్లీ సినిమాలో ఆ క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ …!
