గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ త్వరలో హిమాలయాలకు వెళుతున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తో ఆయన చేస్తున్న తాజా సినిమా అఖండ 2 లో అఘోర పాత్రకు సంబంధించిన సీన్లు షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ హిమాలయాలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ అఘోర పాత్ర సీన్లు ఎక్కడెక్కడ షూట్ చేయాలనే దాని కోసం హిమాలయాలలో రెక్కీ చేసేందుకు బోయపాటి శ్రీను తన బృందాన్ని పంపించారు.అఖండ 2 విషయంలో బోయపాటి అసలు రాజీ పడడం లేదు. ఇటీవల మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇప్పుడు హిమాలయాలకు వెళుతున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్ది అఖండ 2 పై ప్రేక్షకులలో అంచనాలు మరిన్ని పెరుగుతున్నాయి. అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ రోల్ చేశారు. సీక్వెల్ వచ్చే సరికి హీరోయిన్ మారింది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.
అఖండ 2లో సంయుక్త హీరోయిన్ కాగా… ఆది పినిశెట్టి విలన్. బోయపాటి శ్రీనుతో ఈ యంగ్ హీరోకి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు సరైనోడు చేశారు. ఆ సినిమాలో ఆది పినిశెట్టి వైరం ధనుష్ అనే విలన్ పాత్రలో అదరగొట్టారు. ఏదేమైనా అఖండ 2 మీద అంచనాలు మామూలుగా లేవు.