Movies"ఆ ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోలేను".. కొత్త డౌట్లు పుట్టిస్తున్న నాగచైతన్య...

“ఆ ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోలేను”.. కొత్త డౌట్లు పుట్టిస్తున్న నాగచైతన్య ప్రేమ మాటలు..!

మనకు తెలిసిందే.. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య . తనదైన స్టైల్ లో ఎన్నెన్నో సినిమాల్లో నటించాడు . ఆయన నటించిన ప్రతి సినిమా హిట్ అయిందా..? అంటే నో అని చెప్పాలి .. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి . అయితే హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా నాగచైతన్య తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రెసెంట్ నాగచైతన్య తండ్రి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

అంతేకాదు నాగచైతన్య పర్సనల్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . నాగచైతన్య హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . కాగా నాగచైతన్య ప్రజెంట్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి . దీనికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వడం కూడా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య తన పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు . చెన్నైలో పుట్టి పెరిగిన నాగచైతన్య డిగ్రీ చదివే సమయంలో హైదరాబాద్ కి వచ్చేసాడట . డిగ్రీ చదువుతున్న మూమెంట్లోనే సమ్మర్ వెకేషన్ కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడట . అంతేకాదు చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్లో ముంబైకి వెళ్లి మరోసారి తల్లితోపాటు హైదరాబాద్కు ట్రైన్ జర్నీ చేశారట.. ఇలా రెండుసార్లు ప్రయాణం నాకు ఎప్పటికీ స్పెషల్ గా ఉంటుంది అని.. నా లైఫ్ లో అది మర్చిపోలేని జర్నీ అని.. నాగచైతన్య చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎన్ని ప్రదేశాలు చూసిన.. చివరికి నా రిటైర్మెంట్ సమయానికి గోవాలోని సెటిల్ అవుతాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు . 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవాకి షిఫ్ట్ అయిపోతాడట. ప్రజెంట్ ఆయన చేసిన కామెంత్స్ బాగా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news