Moviesఈ వైజాగ్ వాళ్లు మామూలుగా లేరుగా.. చరణ్ ని చూసి చూడగానే...

ఈ వైజాగ్ వాళ్లు మామూలుగా లేరుగా.. చరణ్ ని చూసి చూడగానే ఏం చేశారో చూడండి(వీడియో)..!!

జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోకి కూసింత ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ రీసెంట్గా చేసిన పనికి షాక్ అయిపోయాడు డైరెక్టర్ , నటుడు ఎస్ జె సూర్య . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్.

అప్పుడెప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది . మార్చి 15 నుంచి ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్కే బీచ్ లో ఐదు రోజులపాటు కీలక షెడ్యూల్ జరగబోతుంది . ఈ క్రమంలోనే బీచ్ వద్ద పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ కూడా నిర్మించారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా రాంచరణ్ – శంకర్ – సూర్యతోపాటు ఈ షెడ్యూల్లో పాల్గొనాల్సిన మరికొందరు నటీనటులు కూడా వైజాగ్ చేరుకున్నారు . ఇక రాంచరణ్ వస్తున్నాడు అని తెలియడంతో రామ్ చరణ్ అభిమానులు అక్కడ చేసిన సందడి అంతా కాదు . వైజాగ్ ఎయిర్పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం నాన్న రచ్చ చేశారు. ఎయిర్పోర్ట్ అంతా రాంచరణ్ అభిమానులతో కోలాహలంగా మారిపోయింది . రామ్ చరణ్ అభిమానులను అక్కడ సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోయారు . భారీ భారీ ఫ్లెక్సీలతో కటౌట్లతో జై చరణ్,.. జై జై చరణ్ అంటూ తెగ గోల చేశారు. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన ఎస్ సూర్య కాసేపు అభిమానుల సందడిని చూస్తూ ఉండిపోయారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news