Moviesదీప్తి సునయన హీరోయిన్గా మిస్ చేసుకున్న టాప్ 3 బ్లాక్ బస్టర్...

దీప్తి సునయన హీరోయిన్గా మిస్ చేసుకున్న టాప్ 3 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. అన్నిటికి ఒక్కటే రీజన్..!

దీప్తి సునయన.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . డబ్స్మాష్ వీడియోస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునైన .. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్‌స్ తో కుర్రాళ్లను బాగా అట్రాక్ట్ చేసింది . ఇప్పటికి పలు కవర్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను తనదైన స్టైల్ లో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది .

కాగా దీప్తి సునయనకు హీరోయిన్గా ఛాన్సెస్ వస్తున్న సరే ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చుందట . దానికి కారణం ఆమె కట్టుబాట్లే .. తన ఇంట్రెస్ట్ కొద్ది మాత్రమే సోషల్ మీడియాలో యూట్యూబ్లో యాక్టివ్ గా ఉండేలా కుటుంబం నిర్ణయం తీసుకుందని.. సినిమా ఇండస్ట్రీలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సునైనాను పంపించే ప్రసక్తే లేదు అంటూ కండిషన్ పెట్టిందట .

అయితే దీప్తి సునయన టాప్ 3 బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ చేసుకున్న డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తేజసజ్జ హీరోగా నటించిన జాంబీరెడ్డి సినిమాలో హీరోయిన్గా దీప్తి సునయన అనుకున్నారట . కానీ ఆమె రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత డిజె టిల్లు సినిమాలో కూడా హీరోయిన్గా దీప్తి సునైనా నే అప్రోచ్ అయ్యారట. అది కూడా ఆమె రిజెక్ట్ చేసిందట. రీసెంట్గా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన బేబీ సినిమాను కూడా ఆమెనే హీరోయిన్గా ముందు అప్రోచ్ అయ్యారట. ఆమె సినిమాలో చేయనంటే చేయను అంటూ తగేసి చెప్పేసిందట . ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకునిందట దీప్తి సునయన ..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news