Moviesఆ స్పెషల్ రోజున గుడ్ న్యూస్ చెప్పబోతున్న సాయి పల్లవి.. గెట్...

ఆ స్పెషల్ రోజున గుడ్ న్యూస్ చెప్పబోతున్న సాయి పల్లవి.. గెట్ రెడీ ఫ్యాన్స్..!

సాయి పల్లవి .. పేరుకి మలయాళి బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది . వల్గారిటీకి దూరంగా ఉండే సాయి పల్లవి ఎంత ట్రెడిషనల్ గా ఉంటుందో మనకు తెలిసిందే. పద్ధతికి మరో మారుపేరు అనే చెప్పాలి. కాగా ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలోనే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

సాయి పల్లవి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి ప్రతిష్టత్మకమైన ప్రాజెక్టులో భాగం కాబోతుంది అంటూ ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి .అయితే త్వరలోనే దానిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో మరొక న్యూస్ ట్రెండింగ్ గా మారింది . భారతీయ పురాణతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాముడిగా టాలెంటెడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించబోతూ ఉండగా సీతగా సాయి పల్లవి నటించబోతుంది . ఇదే విషయం గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై శ్రీరామనవమి రోజున అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారట. ప్రజెంట్ దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. దీంతో సాయి పల్లవి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. కాగా ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ అగ్ర హీరో యాష్..హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్.. సూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నారట . ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి రోజున అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news