ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ పై చీప్ గా.. వల్గర్ గా కామెంట్స్ చేయడం సాధారణంగా మారిపోతుంది . నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు . రీసెంట్గా స్టార్ హీరోయిన్ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ ఎలాంటి చీప్ కామెంట్స్ చేశారో చూసాం. భారీ డిస్కషన్ – ట్విట్స్ వార్ తర్వాత ఆయన తగ్గి త్రిష ను క్షమాపణలు కోరారు. అయితే రీసెంట్గా మరోసారి త్రిష ఫై సంచలన కామెంట్స్ చేశారు తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్ .
త్రిషపై దారుణాతి దారుణంగా చీప్ కామెంట్స్ చేశాడు . డబ్బులు ఇచ్చి త్రిష రిసార్ట్ కి పిలిపించుకున్నారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో త్రిష ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఈ వ్యాఖ్యలపై వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు త్రిష లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అంటూ కోరుతున్నారు . ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా ట్వీట్ చేసింది .
“దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికి అయిన దిగజారిపోయే నీచమైన మనుషులు పదేపదే చూడడం అసహ్యంగా ఉంది . దీనిపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇకపై చెప్పాల్సింది చేయాల్సింది అంతా న్యాయమే ” అంటూ త్రిష గట్టి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసింది. ప్రెసెంట్ ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషపై ఆ లీడర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు త్రిష అభిమానులు బూతులతో అతగాడిని ట్రోల్ చేస్తున్నారు . కొందరు నీచంగా వాళ్లంతా సిగ్గులేని లం* నా కొడుకులు అంటూ బూతులు తిడుతున్నారు..!!
WTF this Trisha should file legal
— संरिं (@s_a_n_r_i_n) February 20, 2024
action against him,nowdays these
guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/JwbBZQWkVO