Moviesవామ్మో.. ఏంటి ఇది .. ఆ పాట విని గుక్క పట్టి...

వామ్మో.. ఏంటి ఇది .. ఆ పాట విని గుక్క పట్టి ఏడ్చేసిన అనుష్క.. వీడియో వైరల్..!

సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టి కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు . సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అనుష్క శెట్టి ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అనుష్క శెట్టి కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క శెట్టి గతంలో ప్రభాస్ తో కలిసి నటించింది. సినిమా లో ఒక సాంగ్ విని గుక్క పట్టి ఏడ్చేసిందట . ఇదే విషయాన్ని రామ జోగయ్య శాస్త్రి గారు బయటపెట్టారు . రీసెంట్ గా ఒక నెటిజన్..మిర్చి సినిమాలోని ” పండగల దిగివచ్చావు ” సాంగ్ ని ట్యాగ్ చేస్తూ రామ జోగయ్య శాస్త్రికి కామెంట్ పెట్టాడు . “ఇలాంటి పాటలు మళ్లీ ఎప్పుడు రాస్తారు సార్ మా ప్రభాస్ అన్నకి ..?”అంటూ మెసేజ్ చేశాడు .

దీనికి ఆయన రిప్లై ఇచ్చారు. ” ఈ పాటలు చాలా రేర్ గా వస్తాయి అన్న విధంగా కామెంట్ చేస్తూ.. కొరటాల శివ గారు ఇచ్చిన ఛాన్స్.. దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్.. ప్రభాస్ కి మెస్మరైజ్ చేసిన తీరు ..ఈ పాట విన్నప్పుడు అనుష్క గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం నాకు ఇంకా గుర్తున్నాయి “అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో ఈ పాటలో అనుష్క ఏడవాల్సిన అవసరం ఏముంది..? అంటూ కొందరు జనాలు వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. అయితే ఇది ఫుల్ టు ఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సాంగ్ అని ఎవరికైనా ఈ సాంగ్ బాగా కనెక్ట్ అవుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news