Moviesస‌లార్ VS ఢంకీ... షారుక్ సినిమాయే చూస్తా... టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్...

స‌లార్ VS ఢంకీ… షారుక్ సినిమాయే చూస్తా… టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ పైత్యం చూశారా..!

అస‌లే ప్ర‌భాస్ స‌లార్ సినిమాపై నార్త్ మీడియా, బాలీవుడ్ జ‌నాలు ఏడుస్తున్నారు. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌.. ఇటు కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో ప్ర‌శాంత్ నీల్ దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. ఈ టైంలో ఈ యేడాది ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాల‌తో రెండు వెయ్యి కోట్లు కొల్ల‌గొట్టిన షారుక్ న‌టించిన ఢంకీ సినిమా కూడా స‌లార్‌కు పోటీగా వ‌స్తోంది.

బాలీవుడ్ అంతా కూడా స‌లార్‌ను టార్గెట్ చేస్తూ ఢంకీ సినిమాను తెగ ప్ర‌మోట్ చేస్తోంది. స‌లార్‌ను మించి ఢంకీ సూప‌ర్ హిట్ అవుతుందంటూ ఒక్క‌టే ఊద‌ర‌గొట్టేస్తున్నారు. ఈ టైంలో తెలుగోళ్లు అంద‌రూ ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి స‌లార్ సినిమాను ప్ర‌మోట్ చేసుకుని.. స‌పోర్ట్ చేయాల్సింది పోయి మ‌న టాలీవుడ్ వాళ్లే స‌లార్ కంటే ఢంకీ సినిమా గొప్ప‌న్న‌ట్టుగా బిహేయ్ చేయ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

స‌లార్ కోసం తెలుగు సినీ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాదు.. ఇండియ‌న్ సినీ జ‌నాలు అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఉన్నారు. అస‌లు ఇప్పుడు తెలుగు గ‌డ్డ మీద స‌లార్ ఫీవ‌ర్ పెరుగుతూ వెళుతోంది. ఈ టైంలో టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు, న‌టుడు వెంక‌టేష్ మ‌హా పెట్టిన ఓ పోస్ట్ కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. తాను బాలీవుడ్ మూవీ ఢంకీకి వెళుతున్న‌ట్టు పోస్ట్ పెట్టాడు.

మ‌న తెలుగు డైరెక్ట‌ర్ అయ్యి ఉండి… పైగా అత‌డి సినిమా “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” రిలీజ్ టైంలో ప్రభాస్ చేసిన సపోర్ట్ కూడా మ‌ర్చిపోయి కావాల‌నే ఇలా చేశాడంటూ టాలీవుడ్ అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత తాను వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసినా కూడా తెలుగు సినీ అభిమానులు అత‌డిని పెద్ద ఎత్తున ఆడేసుకుంటున్నారు.

వెంక‌టేష్ మ‌హాకు పైత్యం అని టార్గెట్ చేశారు. దీంతో మ‌నోడు తోక ముడుచుకుని త‌న ఎక్స్ అక్కౌంట్ డీయాక్టీవ్ చేసుకొని టోటల్ గా ఆఫ్ లైన్ వెళ్ళిపోయాడు. ఇదే దర్శకుడు లాస్ట్ టైం ప్రశాంత్ నీల్ “కేజీయఫ్” విషయంలో కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news