Moviesయాష్ సినిమాలో సాయి పల్లవి ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు...

యాష్ సినిమాలో సాయి పల్లవి ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. కలలో కూదా ఎక్స్ పెక్ట్ చేయనిది ఇది..!!

కన్నడ నటుడు యాష్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సిరీస్తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న యాష్. ఆ తర్వాత ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కే జి ఎఫ్ సిరీస్ తర్వాత యాష్ ఒక్కటంటే ఒక్క సినిమాపై కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు .

మరీ ముఖ్యంగా ఆయనకు కే జి ఎఫ్ కి మించిన స్థాయి హిట్ ఇచ్చే సినిమా కోసం వెయిట్ చేశాడు అని ఆ కారణంగానే ఆయన మరి ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు అని ప్రచారం జరిగింది. ఫైనల్లీ యాష్ తన 19వ సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటించాడు . కన్నడ పరిశ్రమ నుంచి స్టార్ గా ఎదిగిన ఈ నటుడు తన 19వ సినిమా అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు అంటూ తెలుస్తుంది .

ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 9:55 నిమిషాలకు రివిల్ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు రాకింగ్ స్టార్ . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు సాయి పల్లవి ఈ సినిమాలో స్పెషల్ క్రేజీ రోల్ ప్లే చేయబోతుందట .

ఇప్పటివరకు తన కెరియర్ లో నటించని పాత్ర ఈ సినిమాలో ఆమె చేయబోతుందట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది . మలయాళ దర్శకురాలు గీతో మోహన్ దాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట . ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. గీతూ మోహన్ దాస్ హిందీలో అబద్దాల పాచికలు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు ఆమె దక్కించుకున్నింది. సుమారుగా 50 కి పైగా చిత్రాలలో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు గీతో మోహన్ దాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news