Movies"గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. ఈ ఐదేళ్లల్లో మీకు ఎప్పుడు...

“గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. ఈ ఐదేళ్లల్లో మీకు ఎప్పుడు అలా అనిపించలేదా..?”..గూబ గుయ్యమనిపించిన డైరెక్టర్..!

సాయి రాజేష్ .. ఈ డైరెక్టర్ పేరు పెద్దగా జనాలకు తెలిసేది కాదు . కానీ బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ లిస్టులోకి ఆడ్ అయిపోయాడు . అంతేకాదు ఇప్పుడు పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు . ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెరకెక్కిన బేబీ సినిమా సాయి రాజేష్ కెరియర్ లోనే ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది .

ఈ చిత్రం భారీ వసూలు సాధించింది . హృదయ కాలేయం – కొబ్బరిమట్ట – చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. ప్రజెంట్ సాయి రాజేష్ మరో ప్రతిష్టాత్మకమైన సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు . ఇలాంటి క్రమంలోనే ఓ ఈవెంట్ కి హాజరైన సాయి రాజేష్ సినిమా రివ్యూస్ లపై ప్రశ్నల వర్షం కురిపించారు .

ఆయన మాట్లాడుతూ..” గత ఐదేళ్లుగా నేను చూస్తూనే ఉన్నాను ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా ..?అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు . రాజమౌళి , ఆర్ ఆర్ ఆర్ , బాహుబలి లాంటి సినిమాలకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మీరు నాలుగు రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా కనిపించలేదా ..? మీ వెబ్సైట్లకు అంటూ ఘాటుగా ప్రశ్నించారు .

అంతేకాదు సినిమాలకు రెండు2, 2.25,3,3.25 మధ్య మాత్రమే రివ్యూలు ఇస్తున్నారని.. ఎందుకిలా సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు అంటూ ఫైర్ అయిపోయారు . గత పదేళ్లుగా నాలుగు పాయింట్లు ఇచ్చిన మూవీ ఏదైనా ఉంటే పేరు చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించారు . అయితే దీనికి మీడియా ప్రతినిధి ఘాటుగానే సమాధానమిచ్చారు. ” మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే మీ సినిమా ఫలితాలను డిసైడ్ చేయలేవు కదా..? లక్కీగా చాలా సందర్భాలలో మేము ఇచ్చే రివ్యూలు కూడా మీకు మ్యాచ్ అవుతున్నాయి ..ఎండ్ ఆఫ్ ద డే ఇది వ్యక్తిగత అభిప్రాయం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అది రాజమౌళి సినిమా అయినా మరి ఏ డైరెక్టర్ సినిమా అయినా ఏది మనం డిసైడ్ చేయలేం కదా..? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు”.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news