Moviesసినిమా డిజాస్టర్... అయినా అది నిజ‌మైంద‌ని లయ ఫుల్ హ్యాపీ...!

సినిమా డిజాస్టర్… అయినా అది నిజ‌మైంద‌ని లయ ఫుల్ హ్యాపీ…!

కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి గానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ళను రాబట్టలేవు. ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో తీసే సినిమాలు ఎప్పుడూ వసూళ్ళ విషయంలో నిర్మాతలను డ్సిప్పాయింట్ చేయవు. కనీసం పెట్టిన పెట్టుబాడి అయినా రాబడతాయి. కానీ, కొన్ని సినిమాలు కథ, కథనం బావున్నప్పటికీ ఎందుకనో నిర్మాత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

అలా నిర్మాత నష్టపోయిన సినిమాలు ఏడాదిలో కనీసం ఓ 50 శాతం అయినా ఉంటాయి. దర్శకుడు గుణశేఖర్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమాలు చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్. ఈ సినిమాలకి ఆయన వేయించిన సెట్స్ ఎప్పటికీ జనాలు మర్చిపోరు. గుణశేఖర్ సినిమా అంటే ప్రత్యేకంగా కథలో సెట్ కి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. మహేశ్ బాబు కథ విని చార్మినార్ సెట్ వేయించగలిగే నిర్మాత ఎం ఎస్ రాజు అని ఆయనకి కాల్ చేశాడు.

అలాగే, చూడాలని ఉంది సినిమాకి అశ్వనీదత్, ఒక్కడు సినిమాకి నిర్మాత ఎంఎస్‌. రాజు తోడయ్యారు. కాబట్టే ఆ సినిమాలు అంత రిచ్ గా ఉంటాయి. అయితే, లయ-జగపతి బాబులతో గుణశేఖర్ మనోహరం అనే సినిమా తీశాడు. ఆర్ట్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. కానీ, మనోహరం ప్రేక్షకులను బాగా మెప్పించింది. కమర్షియల్ సినిమా కాకపోవడం వల్ల ఆశించిన వసూళ్ళు రాబట్టలేకపోయింది.

అయితే, కథ విన్నప్పుడే లయ కి కొన్ని సందేహాలు కలిగాయట. ఈ సినిమా జనాలకి నచ్చుతుందా..? అని దర్శకుడు గుణశేఖర్ ని అడిగిందట. ఆయన మాత్రం నీకు అవార్డ్ గ్యారెంటీ. పర్ఫార్మెన్స్ పరంగా నీ బెస్ట్ ఇవ్వు. అదే నీకు అవార్డ్ తెచ్చిపెడుతుందని చెప్పాడట. చివరికి లయతో గుణశేఖర్ చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఈ సినిమాకి 4 నంది అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి లయకి దక్కింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news