Newsప్రీమియ‌ర్ల‌తోనే 2 మిలియ‌న్ డాల‌ర్లు... మ‌హేష్ ' గుంటూరు కారం '...

ప్రీమియ‌ర్ల‌తోనే 2 మిలియ‌న్ డాల‌ర్లు… మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ టార్గెట్ చూశారా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. మామూలుగా మహేష్ బాబు గత నాలుగు సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అటు త్రివిక్రమ్ కూడా అరవింద సమేత, అల వైకుంఠ‌పురంలో లాంటి రెండు ఇట్లు కొట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

సంక్రాంతి కానుక‌గా గుంటూరు కారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 150 కోట్ల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. కేవలం తెలుగు వెర్షన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ఒక సినిమాకు రు. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా థియేట్రికల్ బిజినెస్ కావటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాను యుఎస్ లో ప్రత్యాంగిరా సినిమాస్ వారు రిలీజ్ చేస్తున్నారు. మామూలుగానే యూఎస్లో మ‌హేస్ సినిమాలు మంచినీళ్లు తాగిన‌ట్టుగా 1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేస్తుంటాయి.

అయితే గుంటూరు కారం సినిమాకు ప్రీమియ‌ర్లు, ఫ‌స్ట్ డేతోనే ఏకంగా 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టేలా టార్గెట్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే ఫ‌స్ట్ డే 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు అంటే మామూలు సంచ‌ల‌నం కాదు. మ‌రి ఈ బిగ్ టార్గెట్ ఈ కాంబినేష‌న్‌కు స‌రైందిగానే చెప్పాలి. అల వైకుంఠ‌పురంలో సినిమాతోనే త్రివిక్ర‌మ్ నాన్ బాహుబ‌లి రికార్డులను బ్రేక్ చేసేశాడు.

ఇప్పుడు గుంటూరు కారంతో మ‌రోసారి అల వైకుంఠ‌పురంలో రికార్డుల‌ను బీట్ చేసేదిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంది. ఏదేమైనా గుంటూరు కారం రిలీజ్ టైంకు మ‌రిన్ని సంచ‌ల‌న రికార్డులు ఖాయంగా క‌నిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news