Moviesప్ర‌భాస్ ఫ్యాన్స్ దెబ్బ‌తో రెండు థియేట‌ర్ల‌లో స్క్రీన్లు చిరిగిపోయాయ్‌… ఏకంగా ఇంత...

ప్ర‌భాస్ ఫ్యాన్స్ దెబ్బ‌తో రెండు థియేట‌ర్ల‌లో స్క్రీన్లు చిరిగిపోయాయ్‌… ఏకంగా ఇంత ర‌చ్చా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా తాజాగా రీ రిలీజ్‌ అయింది. 2007లో ప్రభాస్ – నయనతార జంటగా వివి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుండడంతో ప్రభాస్ యోగి సినిమా కూడా రీ రిలీజ్ చేశారు.

అయితే ప్రభాస్ అభిమానులు సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా చాలా చోట్ల నానా రచ్చ రచ్చ చేసేసారు. ఈ క్రమంలోనే రెండు థియేటర్లలో స్క్రీన్లు ధ్వంసం చేశారు. నంద్యాల లోని రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డ్యాన్సులు చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా.. స్క్రీన్ రెండు చోట్ల చిరిగిపోయింది. అలాగే కాకినాడ జిల్లాలోని కాకినాడ శ్రీ ప్రియ థియేటర్లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.

ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో స్క్రీన్ చించి వేయడమే కాకుండా.. కుర్చీలు కూడా ధ్వంసం చేశారు. శ్రీ ప్రియ థియేటర్‌ను ఇటీవల కాలంలో మోడ్ర‌నైజేషన్ చేసి చాలా బాగా రెడీ చేశారు. ఇంతలోనే స్క్రీన్ ధ్వంసం కావడంతో థియేటర్ యజమాన్యం తీవ్ర అగ్రహానికి గురైంది. అస‌లు త‌మ థియేట‌ర్ల‌లో ఇక రీ రిలీజ్ సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌మ‌ని చెప్పేసింది.

ఏదేమైనా రీ రిలీజ్ సినిమాల సందర్భంగా అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్లు డ్యామేజ్‌ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో కూడా ఓ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్ స్క్రీన్‌ను అభిమానులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news