Movies' ఖుషి ' హిట్ అయితే నైజాంలో దిల్ రాజుకు బిగ్...

‘ ఖుషి ‘ హిట్ అయితే నైజాంలో దిల్ రాజుకు బిగ్ బ్రేక్ ప‌డిన‌ట్టే…!

ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్లో నైజంలో దిల్ రాజు తిరుగులేని కింక్‌గా ఎదిగారు. అటు నిర్మాతగాను.. ఇటు టాప్ డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు దూసుకుపోతున్నారు. అటు ఉత్తరాంధ్ర ఏరియాలోను దిల్ రాజు చక్రం తిప్పుతున్నారు. ఇక నైజాంలో అయితే దిల్ రాజుకు తిరుగులేకుండా పోతుంది. ఏషియన్ సునీల్ – దిల్ రాజు – సురేష్ బాబు వీళ్లు ఏక చక్రాధిపత్యంతో నైజాం పంపిణీ రంగాన్ని శాసిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా కాస్త కూసో దిల్ రాజుకు పోటీగా దూసుకు వచ్చిన వరంగల్ శీను లైగర్ – ఆచార్య సినిమాలు పంపిణీ చేసి భారీ నష్టాలతో రేసులో వెనకబడిపోయారు.

అయితే టాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీస్ ఇప్పుడు దిల్ రాజుకు పోటీగా నైజం లో పంపిణీ ఆఫీస్ ఓపెన్ చేసింది. పైగా ఈ సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య – బాలకృష్ణతో వీరసింహారెడ్డి లాంటి రెండు క్రేజీ ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు నైజంలో సొంతంగా పంపిణీ చేసింది. అటు దిల్ రాజు నిర్మించిన విజయ్ వారసుడు సినిమా పోటీలో ఉండగా కూడా ఈ రెండు సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య రిలీజ్ చేసింది.

ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఓన్ రిలీస్ చేసుకోవడంతో మైత్రి వాళ్లకు భారీ లాభాలు వచ్చాయి. చాలామంది ఈ రెండు సినిమాలు తేడా కొడితే దిల్ రాజుకు అసలు అడ్డు అదుపు ఉండదు అనుకున్నారు. ఎప్పుడైతే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయో.. అదే టైంలో దిల్ రాజు సొంత సినిమా వారసుడు సినిమా అంచనాలు అందుకోలేదో మైత్రి వాళ్ళు ఆధిపత్యం చాటినట్టు అయింది.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మైత్రి సొంత సినిమా కావడంతో పాటు నైజాంలో సొంతంగా పంపిణీ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ అయితే మైత్రి వాళ్ళు నైజం పంపిణీరంగంపై మరింత గ్రిప్ సాధించినట్లు అవుతుందని.. అదే టైంలో దిల్ రాజు దూకుడుకు మరో స్పీడ్ బ్రేకర్ పడినట్టు అవుతుందన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్నాయి. ఇక ఖుషి ఆంధ్ర ఏరియాను రు. 22 కోట్ల రేషియోలో మార్కెట్ చేయగా.. విశాఖ ఏరియాకు ఐదు కోట్లకు పైగా అమ్మినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news