Moviesధ‌నుష్ - ఐశ్వ‌ర్య విడాకుల‌కు ఆ ఇంటికి లింక్ ఉందా... వెలుగులోకి...

ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకుల‌కు ఆ ఇంటికి లింక్ ఉందా… వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – ఐశ్వర్య రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి వారిద్దరు వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. 18 సంవత్సరాలు పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండియన్ సినిమా పరిశ్రమనే ఉలిక్కిపడేలా చేసింది. అయితే వీరిద్దరూ ఎందుకు ? విడాకులు తీసుకున్నారు అన్నది సరైన క్లారిటీ లేదు. రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి.

అయితే వీరిద్దరి విడాకులకు కారణం ధనుష్ కట్టించుకున్న ఇల్లే అన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. చెన్నైలోని పోయేస్ గార్డెన్ లో ధనుష్ రు. 150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిని నిర్మించే సమయంలో ధనుష్కు రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. రజనీకాంత్ కు ముందు నుంచి వాస్తు, జ్యోతిష్యం పట్ల విశ్వాసం ఎక్కువ. ఇక్కడ ఇల్లు కడితే కుటుంబానికి అంతగా కలిసి రాదని చెప్పాడట.

ధనుష్ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా పోయేస్ గార్డెన్లో రజ‌ని ఇంటికి అతి సమీపంలోనే పెద్ద ఇల్లు నిర్మించారు. 2021లో ఈ ఇల్లు ప్రారంభమైంది. ఇంటి పనులు ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ధనుష్ – ఐశ్వర్య మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. తన నాన్న కంటే ఇంత రిచ్ గా ఇల్లు కట్టడం ఎందుకని ? ఐశ్వర్య ధనుష్తో గొడవకు దిగేదట. దీంతోపాటు ఐశ్వర్య డైరెక్టర్, నిర్మాత అవడంతో ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి. డ‌బ్బులు భారీగా నష్టపోవటం ధనుష్‌కు ఏమాత్రం ఇష్టం లేదని అలా వారిద్దరి మధ్య గొడవలు చినికి చినికి పెద్దవి అయ్యాయని ప్రచారం జరిగింది.

దీనికి తోడు ధనుష్ హీరోయిన్ అమలాపాల్తో సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా ఐశ్వర్య విడాకుల వరకు వెళ్లిందన్న ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైనా రజనీకాంత్ చెప్పిన దాని ప్రకారం అక్కడ ఇల్లు కడితే వాస్తు పరంగా కలిసి రాదని చివరికి అదే నిజమైందంటారు. అలా వారిద్దరి మధ్య దూరం పెరిగి విడాకుల వరకు వెళ్లారని కోలీవుడ్ ప్రచారం. 2021 లో ధనుష్ ఆ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే 2022లో వారిద్దరు విడిపోయారు. 2023లో ధనుష్ తన తల్లిదండ్రులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news