Moviesపూరీ ఈజ్ బ్యాక్..డబుల్ ఇస్మార్ట్ కోసం డేరింగ్ స్టెప్.. ఒక్కోక్కడికి పగిలిపోవాల్సిందే..!!

పూరీ ఈజ్ బ్యాక్..డబుల్ ఇస్మార్ట్ కోసం డేరింగ్ స్టెప్.. ఒక్కోక్కడికి పగిలిపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనగానే అందరికీ డక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రెసెంట్ ఎలాంటి టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారు మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఒకప్పుడు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అంటే ఎంత హిట్ ట్రాక్ ఉందో .. ఇప్పుడు అంత ఫ్లాప్ ట్రాక్ ఉంది . గతంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు ..ఆయన డిజాస్టర్ రికార్డును ఆయన బద్దలు కొట్టుకునే రేంజ్ లో సినిమాలు తీస్తున్నాడు . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన లైగర్ సినిమా డిజాస్టర్ అయింది .

ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూరి జగన్నాథ్ మళ్లీ ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తీస్తున్నారు . డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అంతేకాదు రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది . అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది .

ప్రెసెంట్ నభా నటేష్ – నిధి అగర్వాల్ లకు పూరి జగన్నాథ్ ఛాన్స్ ఇవ్వడు . ఎందుకంటే వారి ఫేడ్ అవుట్ అయిపోయారు . ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్లో ఆయన పేరు పైకి రావాలంటే స్టార్ హీరోయిన్స్ ఉండాలి . అయితే తెలుగు స్టార్ హీరోయిన్స్ పూరి జగన్నాథ్ ని నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే బాలీవుడ్ ముద్దుగుమ్మలని రంగంలోకి దించుతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఏకంగా శ్రద్ధ కపూర్ -సారా అలీఖాన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో పూరి ఇస్ బ్యాక్ మరోసారి బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటూ పూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా హిట్టయితే పూరీని వేస్ట్ అన్న ఒక్కొక్కరికి పగిలిపోవాల్సిందే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news