Movies"కొంచెమైన బుద్ధి లేదా..?".. మీడియాపై ఫైర్ అయిన మోహన్‌బాబు.. (వీడియో) వైరల్..!!

“కొంచెమైన బుద్ధి లేదా..?”.. మీడియాపై ఫైర్ అయిన మోహన్‌బాబు.. (వీడియో) వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే సెకండ్స్ లో వైరల్ గా మారిపోతున్నాయి. ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూ జరిగిన ఎవరైనా సెలబ్రిటీ టంగ్ స్లిప్పైనా సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే తాజాగా కొద్దిసేపటి క్రితం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మీడియా పై ఫైర్ అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన ఆయనని కవరేజ్ చేయడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా ..కోపంతో మీడియాను బుద్ధి లేదా అంటూ మాట్లాడిన విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి,

అంతేకాదు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకి ఆదేశించిన మాటలు కూడా ఈ వీడియో క్లిప్ లో క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మోహన్ బాబు ఇవాళ షాద్ నగర్.. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కారు ఎక్కేందుకు వెళుతూ ఉండగా.. మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన మోహన్ బాబు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి..? అంటూ చేయి చూయిస్తూ వార్నింగ్ ఇచ్చారు .

అంతేకాదు బుద్ధి లేదా అంటూ ఫైర్ అవుతూ మీడియా లోగోలను లాక్కోండి అంటే బౌన్సర్లకు ఆదేశాలు ఇచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది . దీనిపై మీడియా మీడియా ప్రతినిధులు మోహన్ బాబు పై ఫైర్ అవుతున్నారు . డైలాగ్ కింగ్ అయితే సరిపోదు మాటలు కూడా మంచిగా బాగుండాలి ..మీరు సినీ స్టార్స్ అయితే మేము మీడియా ప్రతినిధులం అంటూ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మోహన్ బాబు బిహేవియర్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news