Moviesసినీ చరిత్రలోనే కని విని ఎరుగని కాంబో..ముగ్గురు పాన్ ఇండియా హీరోలతో...

సినీ చరిత్రలోనే కని విని ఎరుగని కాంబో..ముగ్గురు పాన్ ఇండియా హీరోలతో బిగ్ మల్టీ స్టారర్ మూవీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా కనబడుతున్నాయి ..వినిపిస్తున్నాయి . జనాలు కూడా ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడంతో స్టార్ట్ డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలను పెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీలను తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రీసెంట్గా అల్లు అర్జున్ సినీ చరిత్రలోనే కని విని ఎరుగని మల్టి స్టారర్ లో నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

మనకు తెలిసిందే పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్ .. త్వరలోనే పుష్ప2 తో కూడా బాలీవుడ్ ను అల్లాడించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఆల్రెడీ అల్లు అర్జున్ – సందీప్ వంగారెడ్డి కాంబినేషన్లో బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే బన్నీ మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ కి సిద్ధం అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

తాజాగా బన్నీ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రెండో వివాహానికి హాజరయ్యారు. ఆర్జీవీ బామ్మర్ది, నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగ ట్రైనర్ ఐరా త్రివేదిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – అమీర్ ఖాన్ – హృతిక్ రోషన్ సరదాగా కాసేపు ముచ్చటించుకుని హగ్ చేసుకుని కబుర్లు ఆడుకున్నారు.

దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే త్వరలోనే వీళ్ళ ముగ్గురు కలిసి మల్టీ స్టారర్ సినిమా తీయబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఇది సెట్ అయితే మాత్రం సినీ ఇండస్ట్రీలో కని విని ఎరుగని కాంబో గా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఈ కాంబో ను సెట్ చేసే డైరెక్టర్ ఎక్కడున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news