Movies"ఛీ ఛీ సన్యాసితో ప్రేమ" ..ఒక్క కారణంగా "దేశముదురు" సినిమాను రిజెక్ట్...

“ఛీ ఛీ సన్యాసితో ప్రేమ” ..ఒక్క కారణంగా “దేశముదురు” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కథలను కొన్ని కొన్ని సార్లు హీరోలు తెలియకుండానే మిస్ చేసుకుని పెద్ద తప్పు చేస్తూ ఉంటారు .అలాంటి ఓ పెద్ద తప్పు చేశాడు అక్కినేని మనవడు సుమంత్ యార్లగడ్డ . ఇండస్ట్రీలో సుమంత్ యార్లగడ్డకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు . అయితే అక్కినేని మనవడుగా మాత్రం క్రేజ్ సంపాదించుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి నానాదంటాలు పడ్డారు. అయినా ఎందుకో స్టార్ గా మారలేకపోయాడు .

దానికి మెయిన్ రీజన్ ఆయన చూస్ చేసుకునే సినిమాలే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు . గతంలో అల్లు అర్జున్ నటించిన ఓ సినిమాని ఆయన మిస్ చేసుకున్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఐకాన్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ ” దేశముదురు ” అనే సినిమాతో స్టార్ హీరో గా మారిపోయాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా హన్సిక హీరోయిన్గా పరిచయమైంది .

2007లో జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ అని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది. పెట్టిన దానికి ట్రిపుల్ లాభాలు తీసుకొచ్చింది . కాగ ఇంత మంచి సినిమా కథను ముందు పూరి జగన్నాథ్ సుమంత్ యార్లగడ్డతో డిస్కస్ చేసాడట. ఆయన స్టార్ గా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది అంటూ సజెస్ట్ చేశారట . అయితే హీరో సన్యాసిని ప్రేమిస్తాడు అన్న జస్ట్ లైన్ మాత్రమే చెప్పాడట. దీంతో ఆ స్టోరీ లైన్ పెద్దగా ఏం బాగోలేదు అంటూ రిజెక్ట్ చేశారట సుమంత్. ఆ తర్వాత ఈ కథ అల్లు అర్జున్ చేతికి వెళ్లి ఎంత హిట్ అయిందో ..ఎన్న్ రికార్డులను బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఈ సినిమాను మిస్ చేసుకుని హీరోగా సుమంత్ చరిత్రలో మిగిలిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news