Gossipsరామ‌య‌ణాన్ని చెడ‌గొట్టారు.... ఆదిపురుష్ రాజ‌మౌళికి అస్స‌లు న‌చ్చ‌లేదా...!

రామ‌య‌ణాన్ని చెడ‌గొట్టారు…. ఆదిపురుష్ రాజ‌మౌళికి అస్స‌లు న‌చ్చ‌లేదా…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఆదిపురుష్ సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇండియాలో పాన్ ఇండియా రేంజ్‌లో వ‌చ్చిన ఈ సినిమాను రు. 600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ రాముడిగా, కృతిస‌న‌న్ సీత‌గా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ లంకేశ్‌గా న‌టించ‌గా స‌న్నీసింగ్‌, దేవ‌ద‌త్ నాగ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించారు.

ఇక నిన్న రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా వ‌న్ టైం వాచ్‌బుల్ మూవీ అని అంద‌రూ చెపుతున్నా ఈ అద్భుత‌మైన ఇతిహాస గాథ‌ను ప్రేక్ష‌కుల మ‌న‌స్సులోకి చొచ్చుకుపోయేలా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఫెయిల్ అయ్యాడ‌నే అంటున్నారు. ఈ విష‌యంలో అంద‌రిది ఒకే మాట‌గా వినిపిస్తోంది.

ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కూడా రామాయ‌ణం అంటే ఎంతో ఇష్టం. రామాయ‌ణాన్ని తెర‌కెక్కించాల‌ని చాలాసార్లే అనుకున్నాడు. అయితే ఈ బిజీ షెడ్యూల్స్‌లో కుద‌ర‌డం లేదు. తాజాగా నిన్న ఆదిపురుష్ సినిమా చూసిన రాజ‌మౌళి బాగా డిజ‌ప్పాయింట్ అయిన‌ట్టు అత‌డి స‌న్నిహితుల ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

క‌నీసం పాత్ర‌ల ఆహారం కూడా స‌రిగా ఉండేలా చూసుకోలేద‌ని… ఇదేం రామాయ‌ణం… ఇంత దారుణంగా తీస్తార‌ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని రాజ‌మౌళి త‌న తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. నిజంగా సినిమా చూసిన ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ కూడా ఇదే సినిమా రాజ‌మౌళి తీస్తే క‌నీసం నాలుగైదు అస్కార్ అవార్డులు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని.. ఓంరౌత్ సినిమాను పూర్తిగా చెడ‌గొట్టేశార‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news