Newsలాస్ట్ మినిట్ ప్లాన్ చేంజ్.. పూజా హెగ్డే కి కోలుకోలేని షాకిచ్చిన...

లాస్ట్ మినిట్ ప్లాన్ చేంజ్.. పూజా హెగ్డే కి కోలుకోలేని షాకిచ్చిన మృణాల్ ఠాకూర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిపోతున్నాడు. ఇప్పటికీ శివనిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా సమంత నటిస్తుంది . ఇది కాకుండా విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో అందాలు ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది.

ఈ రెండు సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ కాంబో ని సెట్ చేశాడు విజయ్ దేవరకొండ . సర్కారి వారి పాటలాంటి సినిమాని డైరెక్టర్ చేసిన పరుశురామ్ తో తన నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు విజయ్. ఆల్రెడీ విజయ్ – పరశురాం కాంబోలో “గీతాగోవిందం” సినిమా వచ్చి బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . కాగా వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తుంది అని తెలియడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి .

ఈ పూజా కార్యక్రమాలు నిర్మాత మల్లెమాల అధినేత శాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది . ప్రముఖ ఫైనాన్షియల్ సత్తి రంగయ్య కెమెరా స్పీచ్ ఆన్ చేశారు . కాగా నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే అనుకున్నారు జనాలు . దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అంతా ఫిక్స్ అయిపోయింది ..రేపో మాపో అగ్రిమెంట్లపై సైన్ అన్నస్దాయికి వచ్చేసింది. అయితే రాత్రికి రాత్రి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను తప్పిస్తూ మృణాల్ ని ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తెల్లవారే పూజా కార్యక్రమాలను మొదలుపెట్టి అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ – పూజా హెగ్డే ల పేర్లు వైరల్ గా మారాయి . అయితే ఎందుకు పూజాని తీసేసి..లాస్ట్ మినిట్ లో మృణాల్ ని పెట్టుకున్నారు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. దీంతో సోషల్ మీడియాలో పూజాను మరింత రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news