Movies"మీసం మెలివేయ్యండి డార్లింగ్స్ ".. ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్ కి అభిమానులు...

“మీసం మెలివేయ్యండి డార్లింగ్స్ “.. ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్ కి అభిమానులు ఊగిపోవాల్సిందే.. !!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి . ప్రభాస్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూట్ ని మొత్తం కంప్లీట్ చేసేసుకున్న టీం త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది.

రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ .. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పాయి . ఈ క్రమంలోనే “ఆది పురుష్”.. సినిమా రిలీజ్ రోజే థియేటర్స్ లో గ్రాండ్గా ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట . దీంతో ఫాన్స్ కు డబ్బులు ధమాకా ట్రీట్ రెడీ చేయబోతున్నాడు ప్రభాస్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటించిన సినిమా “సలార్”.

ఇప్పటికే 70% సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది . త్వరలో రిమైనింగ్ సినిమా కూడా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఇలాంటి క్రమంలోనే ఆది పురుష్ సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ లో ” సలార్ ” సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారట. దీంతో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అంటూ చెప్పుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news