Moviesఅంత మంది పనులు మానుకుని మరీ వచ్చిన అన్ స్టాపబుల్ షో...

అంత మంది పనులు మానుకుని మరీ వచ్చిన అన్ స్టాపబుల్ షో కి..చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య హోస్టుగా చేసిన షో అన్ స్టాపబుల్ . ఆహాలో కనివిని ఎరుగని రేంజ్ లో స్టార్ట్ అయిన ఈ షో ఇప్పటికే టు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది . షోకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ఈ షోకి ఆల్మోస్ట్ ఆల్ అందరు టాలీవుడ్ హీరోలు వచ్చేసారు.. జూనియర్ ఎన్టీఆర్ – చిరంజీవి తప్పిస్తే మిగతా హీరోలు అందరూ ఈ షోలో మెరిసిన వారే. అది టాలీవుడ్ యంగ్ హీరోలు కాదు.. సీనియర్ హీరోలు కాదు.. పొలిటిషియన్లు కూడా ఈ షోలో మెరిశారు .

వాళ్లతో బాలయ్య కి ఉన్న మిస్ అండర్స్టాండింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ రవితేజలపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది . కాగా ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో చిరంజీవికి బాలకృష్ణకి గొడవలు ఉన్నాయి అన్న ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఒకవేళ చిరంజీవి నిజంగానే షోకి వచ్చారంటే ఆ విషయాలపై క్లారిటీ వచ్చి ఉండేదని .. వాళ్ళ మిస్ అండర్స్టాండింగ్ పై వస్తున్న వార్తలకు కూడా బ్రేక్ పడేవి అని చెప్పుకొస్తున్నారు .

అయితే ఎందుకు చిరంజీవి ఈ షో కి రాలేదు అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఎపిసోడ్లో మాట్లాడుతూ చరణ్ కచ్చితంగా షో కి వస్తామని చెప్పుకొచ్చారు . అయితే ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ జరిగినా చిరంజీవి కానీ చరణ్ కానీ రాలేదు . ఈ క్రమంలోని ఎందుకు వీళ్ళు రాలేదంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే చిరంజీవికి కాల్ షీట్స్ కుదరక టైం కేటాయించలేక రాలేదు అని చరణ్ కూడా సినిమా ప్రమోషన్స్ లో సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం కారణంగానే బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అటెండ్ కాలేకపోయాడని చెప్పుకొస్తున్నారు . కచ్చితంగా సీజన్ 3 లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే చిరంజీవి-చరణ్ ఇద్దరు కలిసి షోకి వస్తారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news