Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నిర్మాత ఎఫైర్‌... త‌న‌తో ప‌డుకోవాల‌ని బ‌ల‌వంతం చేశాడా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నిర్మాత ఎఫైర్‌… త‌న‌తో ప‌డుకోవాల‌ని బ‌ల‌వంతం చేశాడా..?

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డ‌మ్‌ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరీర్ ప్రారంభంలో చిన్నాచిత‌కా పాత్ర‌లలో నటించిన‌ విజయ్ వరుసగా సూపర్ డూపర్ హిట్ల‌తో యూత్ లో ఐకాన్ గా మారిపోయాడు. ఇక గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగ‌ర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో కూడా నటించాడు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కర‌ణ్‌ జోహార్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

అలాగే పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌ కూడా లైగ‌ర్‌కు నిర్మాతలుగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.. విజయ్ దేవరకొండ పరువు మొత్తం తీసేసింది. అందుకనే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేయాల్సిన జనగణమన సినిమా కూడా మధ్యలోనే ఆపేశాడు. దీంతో ఇప్పుడు విజయ్ సమంతతో కలిసి శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇప్పుడు చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది. లైగర్ సినిమా నిర్మాత కరణ్ జోహార్.. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ తో ఎఫైర్ పెట్టుకోవాలని అనుకున్నాడని.. విజయ్‌తో పడుకోవాలని అనుకున్నాడని.. అయితే కరణ్ జోహార్ ఇచ్చిన ఆఫర్‌ను విజయ్ తీవ్రంగా తిరస్కరించాడు అంటూ రాసుకు వచ్చాడు.

గత కొంతకాలంగా ఉమైర్‌ ఇలా కాంట్రవర్సీ కామెంట్లు పెడుతున్నాడు. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు గురించి కూడా పోస్టులు పెడుతూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కర‌ణ్‌ జోహార్ విజయ్ దేవరకొండతో ప‌డుకునేందుకు ప్రయత్నించాడంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఉమైర్ ఫేమస్ అవ్వటం కోసమే ఇలాంటి చీఫ్‌ ట్రిక్కులు ప్లే చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news