Moviesజ‌మున చేసిన ప‌నితో సావిత్రికి మండిపోయిందా... చివ‌ర‌కు ఇంత గొడ‌వ జ‌రిగిందా...!

జ‌మున చేసిన ప‌నితో సావిత్రికి మండిపోయిందా… చివ‌ర‌కు ఇంత గొడ‌వ జ‌రిగిందా…!

జ‌మున.. ఇటీవ‌ల మ‌ర‌ణించిన అగ్ర‌శ్రేణి న‌టీమ‌ణి, నాయ‌కురాలు. రాజ‌మండ్రి ఎంపీగా కూడా ఆమె ప‌నిచే శారు. అయితే.. సినిమా రంగంలో సావిత్రికి జ‌మునకు మధ్య అవినాభావ సంబంధం ఉండేది. మిస్స‌మ్మ‌, మూగ‌మ‌న‌సులు.. వంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల్లో ఇద్ద‌రూ న‌టించారు. దీంతో వీరి మ‌ధ్య అక్క చెల్లెలు అనే అనుబంధం కూడా పెరిగింది. చెన్నైలోని టీ న‌గ‌ర్‌లోనే ఇద్ద‌రూ పొరుగున ఉండేవారు.

వారు ఉంటున్న ఇళ్ల‌నే కొనుగోలు చేయ‌డం తర్వాత కాలంలో జ‌రిగిన గొప్ప సంఘ‌ట‌న‌. త‌మిళంలోనూ ఇద్ద రూ క‌లిసి న‌టించిన సినిమాలు ఉన్నాయి. సుదీర్ఘ‌కాలం పాటు.. జ‌మున సావిత్రిల బంధం కొన‌సాగింది. అయితే.. త‌ర్వాత కాలంలో వీరి మ‌ధ్య వివాదాలు పొడ‌చూపాయి. దీనికి కార‌ణం.. జ‌మున ఏ విష‌యాన్న‌యి నా.. ముక్కుసూటిగా చెప్పేవారు. దేనినీ దాచుకునేవారు కాదు. త‌న మ‌న అనే తేడా కూడా లేదు.

అందుకే ఆమెకు పొగ‌రు ఎక్కువ అని టాక్ ఉండేది. చివ‌ర‌కు ఆమె ఏఎన్నార్‌నే మీరు సెట్లో వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు.. నాతో బిహేవ్ చేస్తోన్న విధానం నాకు న‌చ్చ‌లేద‌ని ఓపెన్‌గానే చెప్పేశారు. దీంతో జ‌మున‌పై ఏఎన్నార్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌కు కూడా చెప్పి ఆమెను రెండేళ్ల పాటు త‌మ సినిమాల్లో బ్యాన్ చేయించారు. అయినా కూడా జ‌మున ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు.

ఈ ముక్కుసూటి త‌నం త‌ర‌హా అభిప్రాయాలే.. సావిత్రి – జ‌మునల మ‌ధ్య గ్యాప్‌ను పెంచాయి. ఒకానొక ద‌శ‌లో సావిత్రి మ‌త్తులోనే షూటింగులకు వ‌చ్చేవార‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం ఉండేది. ఇది అక్క‌డితో పోలేదు. జ‌మున చెవిలో చెప్పేవా రు. మీ అక్క బొత్తిగా ఇలా మారిపోయిందేమిటి? అని అంటుండేవారు. దీంతో జ‌మున ఉండ‌బ‌ట్టలేక‌.. సావిత్రిని ప్ర‌శ్నించ‌డంతో ఆమె ఫైర్ అయ్యారు.

సావిత్రి ఇది త‌న ప‌ర్స‌న‌ల్ విష‌య‌మ‌ని చెప్ప‌డంతో… నీ మంచి కోరు చెబుతున్నాన‌ని.. జ‌మున అన‌డం దీంతో ఇరువురి మ‌ధ్య వాదోప‌వాదాలు చోటు చేసుకోవ‌డంతో త‌ర్వాత కాలంలో దూర‌మ‌య్యారు. చివ‌ర‌కు జ‌మున హైద‌రాబాద్ వ‌చ్చేప్పుడు కూడా సావిత్రికి చెప్ప‌లేద‌ట‌. అప్ప‌టికి సావిత్రి బాగా చితికిన ప‌రిస్తితిలో ఉన్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news